📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

మహేష్ బాబు మూవీపై ఒడిశా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: March 12, 2025 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లోతెరకెక్కుతున్న చిత్రం SSMB29. టాలీవుడ్‌ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా మారిన ఈ సినిమా గురించి భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేశ్ కెరీర్‌లో 29వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం, రాజమౌళి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.ప్రస్తుతం ఈ చిత్రం ఒడిశా రాష్ట్రంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమా గురించి ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్

ప్రవతి పరిదా ట్విట్టర్ వేదికగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో మల్కాన్‌గిరి ప్రాంతంలో పుష్ప-2 షూటింగ్ జరిగినట్లు గుర్తుచేస్తూ, ఇప్పుడు SSMB29 మూవీ కోరాపుట్‌లో చిత్రీకరణ జరుగుతోందని తెలిపారు.అంతేకాదు, ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు అంతర్జాతీయ నటీమణి ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ వార్తపై ఇప్పటివరకు మూవీ యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.ఈ సినిమా ఒడిశాలో చిత్రీకరించడం ద్వారా పర్యాటక రంగానికి పెద్ద ప్రోత్సాహం లభిస్తుందని, ఒడిశా గమ్యస్థానంగా మారుతుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. అదనంగా, అన్ని చిత్ర పరిశ్రమలను స్వాగతిస్తూ, షూటింగ్స్‌కు మద్దతుగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

సీక్రెట్‌గా షూటింగ్

సాధారణంగా రాజమౌళి సినిమాలు అత్యంత రహస్యంగా చిత్రీకరించబడతాయి. సెట్స్‌లో మొబైల్ ఫోన్లు అనుమతించరు, ఎలాంటి సమాచారం బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఈసారి మాత్రం ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన రాకముందే బయటపడిపోయింది.ఇటీవల మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఎయిర్‌పోర్టులో కలిసిన ఫోటోలు వైరల్ కాగా, తాజాగా డిప్యూటీ సీఎం ట్వీట్‌లోనూ వారి పేర్లు ఉండటం మరింత చర్చనీయాంశంగా మారింది.

వీడియో లీక్

ఇదే సమయంలో, ఒడిశాలో జరుగుతున్న షూటింగ్ సందర్భంగా మహేశ్ బాబు ఒక వీడియో లీక్ అవ్వడం మరో సంచలనంగా మారింది. ఈ వీడియోలో మహేశ్ భిన్నమైన లుక్‌లో కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

చిత్రీకరణ కంప్లీట్

ఈ సినిమా కొంతమేర చిత్రీకరణ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత, యూనిట్ ఒడిశాకు వెళ్ళింది.రాజమౌళి సినిమాల‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్‌ వచ్చినా అది వైరల్‌గా మారుతోంది. కానీ, ఇప్పటి వరకు మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన చేయలేదు.

జక్కన్న ప్లాన్

రాజమౌళి సినిమాల విషయంలో భద్రత అత్యంత కఠినంగా ఉండటం సాధారణమే. బాహుబలి నుంచి RRR వరకు అన్ని సినిమాలకు సంబంధించి, అతను ఎలాంటి లీకులూ జరగకుండా పక్కాగా ప్లాన్ చేస్తుంటారు. కానీ, ఈసారి మాత్రం అధికారిక ప్రకటన రాకముందే కాస్టింగ్ డిటైల్స్ బయటకు రావడం, మహేశ్ బాబు వీడియో లీక్ అవ్వడం కొత్త చర్చకు దారితీసింది.ఇకపై మరింత జాగ్రత్తగా రాజమౌళి లీకులు కట్టడి చేస్తారా? లేక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయా? అనేది చూడాలి!

#BlockbusterInMaking #FilmShoot #IndianCinema #MaheshBabu #OdishaShoot #OdishaTourism #PrithvirajSukumaran #PriyankaChopra #RajamouliNext #SSMB29 #SSRajamouli #SuperstarMahesh #Tollywood Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.