ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఆదివారం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో నిధి అగర్వాల్ భక్తి శ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు. ఇదిలా ఉండగా, ఆలయంలో నిధి అగర్వాల్ ను, చూసిన భక్తులు, అభిమానులు ఆమెతో ఫోటో దిగడానికి ఆసక్తి చూపారు.
Read Also: Meenakshi Chowdhury: కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి ఎంట్రీ?
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: