Latest News: Indrakeeladri: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ

Read Time:  1 min
Indrakeeladri
Indrakeeladri
FONT SIZE
GET APP

విజయవాడ ఇంద్రకీలాద్రి (Indrakeeladri) వద్ద ప్రసిద్ధి గాంచిన దుర్గామాత ఆలయానికి శనివారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రిపై సందడి చేశారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ భక్తులకు ఆనందాన్ని పంచారు.

ED: బిట్‌కాయిన్ మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి పేరు

శనివారం ఆలయానికి చేరుకున్న బాలకృష్ణ (Nandamuri Balakrishna) ను ఆలయ కమిటీ చైర్మన్‌ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ (Committee Chairman) అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు.

Indrakeeladri
Indrakeeladri

దర్శనం అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. “లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను” అని ఆయన తెలిపారు. అమ్మవారి (Ammavari) దృష్టిలో అందరూ సమానమేనని, ఆమె ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు.

దసరా ఉత్సవాల ఏర్పాట్లను బాలకృష్ణ ప్రత్యేకంగా ప్రశంసించారు

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లను బాలకృష్ణ ప్రత్యేకంగా ప్రశంసించారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని కొనియాడారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, నిరంతరాయంగా దర్శనం కల్పించడం అభినందనీయమని దేవస్థానం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.