టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ దుర్వినియోగంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన రూపాన్ని వాడుకుంటూ కొందరు వ్యాపార ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
కోర్టులో పిటిషన్ వేసిన నాగార్జున
నాగార్జున తరఫున న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ, కొన్ని వెబ్సైట్లు ఏఐ సాయంతో ఆయన ఫొటోలు, వీడియోలను మార్చి, అసత్య సమాచారం కలిపి ప్రచారం చేస్తున్నట్లు వివరించారు. ఇది ఆయన వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు.
అశ్లీల కంటెంట్, టీషర్టులపై చిత్రాలు
AI టూల్స్ ఉపయోగించి నాగార్జున ఫొటోలను అశ్లీల కంటెంట్లో వాడుతున్నట్లు, అలాగే ఆయన బొమ్మలను టీషర్టులపై ముద్రించి ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది పూర్తిగా అక్రమమని న్యాయవాదులు స్పష్టం చేశారు.ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న సుమారు 14 వెబ్సైట్ల(14 websites)ను గుర్తించినట్లు తెలిపారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకుని సంబంధిత కంటెంట్ను ఇంటర్నెట్ నుంచి తొలగించాలంటూ కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ చేసిన కేసును కూడా ఉదాహరణగా ప్రస్తావించారు.
హైకోర్టు స్పందన: వ్యక్తిగత హక్కులకు రక్షణ
నాగార్జున పిటిషన్పై స్పందించిన ఢిల్లీ హైకోర్టు, ఆయన లేవనెత్తిన అంశాలను సీరియస్గా పరిగణించినట్లు పేర్కొంది. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులను కాపాడటంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: