బాలీవుడ్ సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్గా పేరుగాంచిన ధర్మేంద్ర (Dharmendra) (89) ఆరోగ్యం విషమించిందన్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. గత వారం రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా, తాజాగా ఆయన్ని ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు శ్వాస సమస్యలు (breathing issues) తలెత్తడంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో “ధర్మేంద్ర మృతి చెందారు” అనే వార్తలు వేగంగా వైరల్ అయ్యాయి.
Read also: Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ పోలింగ్.. ప్రముఖులు ఓట్లు వేసేది ఎక్కడంటే?
ఈ నేపథ్యంలో ఆయన మరణించారంటూ మంగళవారం వార్తలు వ్యాపించడంతో ఆయన కుమార్తె, నటి ఈషా డియోల్ (Esha Deol) తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలను ఖండిస్తూ, తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.”మీడియా అనవసరమైన ఆత్రుతతో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది, ఆయన కోలుకుంటున్నారు.
దయచేసి మా కుటుంబానికి కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరుతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని ఈషా డియోల్ (Esha Deol) ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టుకు ఆమె కామెంట్స్ సెక్షన్ను కూడా డిసేబుల్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :