Muralidhar Goud: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య శశికళ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త తెలియగానే మురళీధర్ గౌడ్ నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శశికళ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాంటూ ప్రార్థిస్తున్నారు. అదే సమయంలో నటుడు మురళీధర్ కు ధైర్యం చెబుతున్నారు.
Read Also: Manchu Manoj: సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు
మురళీధర్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం లోని మెదక్ జిల్లా రామాయం పేటలో జన్మించారు. సిద్దిపేటలో తన విద్యాభాస్యం పూర్తి చేసిన ఆయన హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్లోని ఎలక్ట్రిసిటీ బోర్డ్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పని చేశాడు. సుమారు 27 ఏళ్లు పని చేసిన మురళీ ధర్ 2012లో పదవీ విరమణ చేశాడు. అయితే రిటైర్మెంట్ అయ్యాక నటనపై ఆసక్తిని పెంచుకున్నారాయన.
మెల్లగా సినీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా 2018లో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో ఒక చిన్న పాత్రలో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత డీజే టిల్లు సినిమాలో హీరో తండ్రి పాత్రలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. బలగం, మేమే ఫేమస్, మ్యాడ్, టిల్లు స్క్వేర్, మంగళవారం, కింగ్ డమ్, దండోరా తదితర సినిమా్ల్లో సహాయ నటునిగా మెప్పించారీ సీనియర్ నటులు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: