తెలుగు చిత్రసీమలో ఒక వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన అమర జవాన్ మురళీ నాయక్ (Murali Nayak) జీవిత గాథ ఆధారంగా బయోపిక్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని విశాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మించబోతోంది. ఈ ప్రాజెక్టును పాన్ ఇండియా స్థాయిలో నిర్మించాలని చిత్రబృందం ప్రకటించింది. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రబృందం విశేషాలను వెల్లడించింది. ముఖ్యంగా యువ హీరో గౌతమ్ కృష్ణ ఈ సినిమాలో మురళీ నాయక్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన మాట్లాడుతూ – “ఇది కేవలం ఒక సినిమా కాదు. ఒక నిజమైన హీరో కథ. ఇప్పటివరకు తెలుగు సైనికుని జీవితాన్ని ఆధారంగా చేసుకొని బయోపిక్ తెరకెక్కలేదు. ఇది తొలి ప్రయత్నం. మురళీ నాయక్ వంటి వీర సైనికుల ధైర్యసాహసాల వల్లే మనం ఇక్కడ సుఖసంతోషాలతో జీవిస్తున్నాం. ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు.
గౌతమ్ కృష్ణ తన మొదటి సినిమా
గౌతమ్ కృష్ణ తన మొదటి సినిమా ‘సోలో బాయ్’ విడుదల సమయంలోనే మురళీ నాయక్ కుటుంబంతో ఫోన్లో మాట్లాడానని గుర్తుచేసుకున్నారు. “ఆ సమయంలోనే ఆయన గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. మురళీ నాయక్ గారి త్యాగం గురించి తెలుసుకున్నప్పుడు నాకు గర్వంగా అనిపించింది. ఆ సందర్భంలోనే ఆయనపై సినిమా చేయాలనుకున్నా. ఇప్పుడు అది నిజం కావడం ఆనందంగా ఉంది” అని గౌతమ్ (Gautam Krishna) వెల్లడించారు.భారతదేశ చరిత్రలో ‘ఆపరేషన్ సిందూర్’ ఒక కీలకమైన ఘట్టమని, ఆ యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన మురళీ నాయక్ కథ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. “ఆయన కథ చెబుతున్నప్పుడే నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇంతటి గొప్ప గాథను తెరపైకి తీసుకొచ్చే అవకాశం రావడం నా అదృష్టం.
అతడిని ఈ దేశానికి పరిచయం చేయండి
ఆయన తల్లిదండ్రులను అనుమతి కోరగా, వారు ఏమాత్రం ఆలోచించకుండా అంగీకరించారు. ‘మా అబ్బాయి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించండి. అతడిని ఈ దేశానికి పరిచయం చేయండి’ అని వారు కోరారు” అని గౌతమ్ భావోద్వేగంగా తెలిపారు.నిర్మాత కె. సురేశ్ బాబు మాట్లాడుతూ, “మురళీ నాయక్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. దేశం కోసం ఆయన చేసిన త్యాగం గొప్పది. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తుంది. ఆయన కథను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు అందిస్తాం” అని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మురళీ నాయక్ తండ్రి మాట్లాడుతూ, “ఆపరేషన్ సిందూర్లో మురళీ ఎంతో ధైర్యంగా పోరాడాడు. గౌతమ్ బాబు అతనిపై మంచి సినిమా తీయాలి. ఈ సినిమా భారతీయులందరి హృదయాల్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. మురళీ పాత్రలో గౌతమ్ను చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. ఆయన సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
మురళీ నాయక్ బయోపిక్ను ఎవరు నిర్మిస్తున్నారు?
ఈ సినిమాను విశాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
మురళీ నాయక్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు?
యువ హీరో గౌతమ్ కృష్ణ ఈ బయోపిక్లో మురళీ నాయక్ పాత్రను పోషిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: