యంగ్ హీరో శ్రీవిష్ణు కథల ఎంపికలో ఎప్పుడూ ప్రత్యేకత చూపిస్తుంటారు. వినూత్న కథలు, సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన శ్రీవిష్ణు తాజాగా నటించిన చిత్రం ‘మృత్యుంజయ్’ (Mrithyunjay Movie). ఈ సినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించగా, ‘సామజవరగమన’ తర్వాత ఈ జంట మరోసారి తెరపై కనిపించనుండటం విశేషం. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ కాంబినేషన్పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. శ్రీహుసేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
Read Also: Lavanya Tripathi: నా కుటుంబం జోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకోను
చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం (Mrithyunjay Movie).. ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.‘మృత్యుంజయ్’ టీజర్ ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
చిత్ర యూనిట్ కి తన బెస్ట్ విషెస్ తెలిపారు.. ”మృత్యుంజయ్ టీజర్ ని రూపొందించిన విధానం చాలా నచ్చింది.. అతను సత్యాన్ని వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంది. విష్ణు, హుస్సేన్, సన్నీలకు శుభాకాంక్షలు. ఫిబ్రవరి 27 కోసం ఎదురు చూస్తున్నాను” అని రాజమౌళి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: