భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత గౌరవంగా పరిగణించబడే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (Dadasaheb Phalke Award) ఈ ఏడాది మలయాళ చలనచిత్ర మహానటుడు మోహన్లాల్కు(Mohanlal) ప్రకటించబడింది. ఈ అవార్డు ప్రతిష్టతకు తగ్గట్టుగా ఆయన చేసిన సేవలు కూడా అపారమైనవే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఎక్స్ (X) వేదిక ద్వారా ఆయన తన సందేశాన్ని పంచుకుంటూ, “మలయాళ చలనచిత్ర రంగం (“Malayalam film industry”) మాత్రమే కాకుండా మొత్తం భారతీయ సినిమా తరఫున గర్వపడే ఈ ఘనత మోహన్లాల్దే. నటనలో సహజత్వానికి ప్రాముఖ్యత ఇచ్చి, విభిన్న పాత్రల్లో తన ప్రతిభను నిరూపించిన వ్యక్తి ఆయన” అని పేర్కొన్నారు. కథానాయకుడిగా విభిన్న పాత్రలు పోషించి, అయిదు జాతీయ అవార్డులు (National Awards) పొందారని గుర్తు చేశారు.

తెలుగు వారికి బాగా గుర్తుండిపోతాయని
తెలుగులో ఆయన నటించిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ, అనువాద చిత్రాల ద్వారా మన ప్రేక్షకులను మెప్పించారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇద్దరు, కంపెనీ, తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలు తెలుగు వారికి బాగా గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. మోహన్ లాల్ మరిన్ని విభిన్న పాత్రలు పోషించాలని ఆకాంక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: