Mohan Babu: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని కలిసిన మోహన్ బాబు, మంచు విష్ణు

Read Time:  1 min
Mohan Babu manchu vishnu
Mohan Babu manchu vishnu
FONT SIZE
GET APP

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు మరియు ఆయన కుమారుడు సినీ నటుడు మంచు విష్ణు డెహ్రాడూన్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో కలిశారు ఈ సందర్శనకు సంబంధించిన వివరాలను పుష్కర్ సింగ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు
ముఖ్యమంత్రి మాట్లాడుతూ దక్షిణ భారత ప్రముఖ నటుడు మరియు నిర్మాత అయిన మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు విష్ణు తమను కలవడం సంతోషకరమని తెలిపారు ఈ సందర్బంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సినీరంగానికి సంబంధించి విధానాలు అవకాశాలు గురించి చర్చించినట్టు వివరించారు.

మంచు విష్ణు మరియు మోహన్ బాబు ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప లో నటిస్తున్నారు ఈ సినిమా విడుదలకు ముందు వారు దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలను సందర్శించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది ఈ పుణ్యక్షేత్ర యాత్రను కేదార్ నాథ్ ఆలయం నుండి ప్రారంభించారు పుష్కర్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా గొప్ప పనిని చేపట్టే ముందు దైవదర్శనం చేయడం సాధారణం ‘కన్నప్ప’ చిత్రం విజయం సాధించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు ఈ సమావేశానికి ఉత్తరాఖండ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సీఈవో మరియు సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ జనరల్ కూడా హాజరయ్యారు వీరందరూ రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు సంబంధించి వివిధ అవకాశాలపై చర్చలు జరిపారు
మోహన్ బాబు మంచు విష్ణుల జ్యోతిర్లింగాల యాత్ర మరియు కన్నప్ప చిత్రానికి సంబంధించిన ఈ వార్త సినీ ప్రపంచంలో పెద్దగా చర్చనీయాంశం అవుతోంది.

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.