మలయాళం సినీ పరిశ్రమ నుంచి మరో సర్వైవల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ‘మీషా‘ సినిమా గత నెల జులై 31వ తేదీన థియేటర్లలో విడుదలై, అక్కడ మంచి స్పందనను అందుకుంది. థ్రిల్లింగ్ కథనంతో, మలయాళం(Malayalam)లో మంచి మార్కులు కొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల కోసం రెడీ అవుతోంది.
ఆహా తమిళ్లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఇటీవల తమిళంలో కూడా విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఆహా తమిళ్ (Aha Tamil)ప్లాట్ఫారంలో సెప్టెంబర్ 12న స్ట్రీమింగ్ కానుంది. మలయాళం ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ సినిమా, తమిళ ఆడియన్స్ను కూడా అలరిస్తుందని అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే తెలుగు ఓటీటీ వేదికగా కూడా విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
నటనతో మెప్పించిన కథిర్ – ఫస్ట్ మలయాళ్ సినిమా
ఈ సినిమా ద్వారా నటుడు కథిర్, మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇది ఆయనకు మొదటి మలయాళ చిత్రం కావడం విశేషం. సినిమాలో కథిర్ నటనకు విశేషమైన ప్రశంసలు లభించాయి. మరొక కీలక పాత్రలో షైన్ టామ్ చాకో నటించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, తెరపై సాగే సస్పెన్స్కు బలమైన హైలైట్గా నిలిచాయి.
ఈ చిత్రానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథానుగుణంగా సినిమాకు ఆసక్తిని కలిగించింది. విమర్శకుల అభిప్రాయం ప్రకారం, సౌండ్ డిజైన్, విజువల్స్, ఎమోషన్స్ అన్ని కలిసి సినిమాను థ్రిల్లింగ్ అనుభూతిగా మార్చేశాయి. కథలో వచ్చే మలుపులు, చివరకు ఊహించని ట్విస్టులు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కథలోకి వెళ్లితే..
కథ ప్రకారం, ఒక ఫారెస్ట్ గార్డ్ తన ఆరుగురు స్నేహితులను రీ యూనియన్ డిన్నర్కి ఆహ్వానిస్తాడు. ఈ గ్రూప్ ఫారెస్ట్లోని ఒక లోతైన ప్రదేశానికి వెళతారు. కానీ వారు వెళ్లిన ప్రదేశం బహుళ ప్రమాదాలతో నిండి ఉంది అన్న విషయం వారికి అక్కడికి వెళ్లిన తరువాతే తెలుసుకుంటారు. అప్పుడు మొదలవుతుంది అసలైన సర్వైవల్ గేమ్. వాళ్లు అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడతారా లేదా? అనే ఉత్కంఠభరిత కథతో సినిమా ముందుకు సాగుతుంది.
త్వరలో తెలుగు ఓటీటీలో కూడా విడుదల కానుందా?
తమిళంలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న ఈ సినిమా, తెలుగు ఓటీటీ ఆడియన్స్ కోసం కూడా త్వరలోనే విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. సస్పెన్స్, థ్రిల్, సర్వైవల్ ఎలిమెంట్స్తో నిండిన ఈ చిత్రం, అటు కథానికతోనూ, ఇటు నటనతోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని భావిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: