తమిళ సినీ పరిశ్రమ నుండి వచ్చిన కొత్త ప్రయత్నాల్లో ఒకటిగా నిలిచిన ‘మనిదర్గళ్’(Manidargal) సినిమా, థియేటర్లలో మంచి ఆసక్తిని రేకెత్తించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా సాగిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ (OTT Streaming) కు సిద్ధమవుతోంది. మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు జులై 17వ తేదీ నుంచి ఆహా తమిళ్ డిజిటల్ ప్లాట్ఫారంలో అందుబాటులోకి రానుంది.

దర్శకుడి కొత్త దృష్టికోణం
ఈ సినిమాకి రామ్ ఇంద్ర దర్శకత్వం (Directed by Ram Indra) వహించారు. సామాజిక స్పృహ కలిగిన, ఆలోచనలకు ఆహ్వానం పలికే కథను ప్రెజెంట్ చేయడంలో ఆయన వినూత్నమైన ప్రయత్నం చేశారు. సినిమా పోస్టర్లు, టీజర్లు విడుదలైనప్పటి నుంచీ ప్రేక్షకుల్లో ఓ రకమైన మిస్టరీ ఆసక్తిని కలిగించాయి.
ఈ సినిమాలో కపిల్ వేలవన్, దశ ముఖ్యపాత్రల్లో కనిపించగా, గుణవంతన్, అర్జున్ దేవ్, శరవణన్, సాంబశివన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కథాంశం – మానవ సంబంధాల వెనక దాగిన నిజాలు
కథలో ఆరుగురు స్నేహితులు ఒక రోజు పార్టీ చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. మద్యం మత్తులో రాత్రివేళ ఇంటికి బయలుదేరిన ఈ గ్రూప్, మార్గ మధ్యంలో ఓ అనూహ్య సంఘటనకు గురవుతుంది. ఆ సంఘటన తాలుకూ ప్రభావం, వారి జీవన మార్గాన్ని ఎంతలా మలుపు తిప్పిందన్నదే కథాసారాంశం. ఈ కథలో వ్యక్తిగత బాధ్యత, పరిణామాలు, స్నేహితుల మధ్య సున్నితమైన భావోద్వేగాలను తక్కువ మాటలతో, గాఢతతో చూపించే ప్రయత్నం చేయడం ప్రత్యేకత. కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావొచ్చని మేకర్స్ భావిస్తున్నారు.
ఓటీటీ స్ట్రీమింగ్ సమాచారం
‘మనిదర్గళ్’ (Manidargal) సినిమా జులై 17వ తేదీ నుంచి “ఆహా తమిళ్” ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లకు వెళ్లలేని వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Dhanashree Verma: ‘బిగ్బాస్ 19’లో పాల్గొననున్న చాహల్ మాజీ భార్య ధనశ్రీవర్మ?