Vijay Sethupathi-Sai Pallavi: కొత్త మూవీని ప్రకటించిన మణిరత్నం

Read Time:  1 min
Vijay Sethupathi-Sai Pallavi: కొత్త మూవీని ప్రకటించిన మణిరత్నం
FONT SIZE
GET APP

Vijay Sethupathi-Sai Pallavi: మణిరత్నం తన 19వ సినిమా కోసం మళ్ళీ ఏఆర్ రెహమాన్‌తో చేతులు కలిపారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, వాటన్నింటికీ చెక్ పెడుతూ మద్రాస్ టాకీస్ సంస్థ రెహమాన్ పేరును ఖరారు చేసింది. దీంతో ఈ లెజెండరీ కాంబో మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది.

Read Also: Guvvala Cheruvu Ghat Web Series First Look: ‘గువ్వల చెరువు ఘాట్’ నుంచి గ్లింప్స్ విడుదల

మ‌ణిర‌త్నం సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి

1992లో ‘రోజా’ సినిమాతో మొదలైన వీరిద్దరి అద్భుత ప్రయాణం, ఇప్పుడు 19వ సారి ఈ కొత్త సినిమాతో కొనసాగబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి హీరోగా న‌టించ‌బోతుండ‌గా.. ‘నేచురల్ స్టార్’ సాయి పల్లవి మ‌ణిర‌త్నం సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌బోతుంది.

ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం రెహమాన్ ఇప్పటికే ఒక పాటను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూలై నాటికి ప్రారంభం కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.