బాలీవుడ్ నటి శిల్పాశెట్టి , ఆమె భర్త రాజ్ కుంద్రా ఇటీవల వరుస వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే వీరిపై రూ.60 కోట్ల భారీ మోసం కేసు నమోదవడం సంచలనంగా మారింది. ఆ వివాదం ఇంకా సద్దుమణగకముందే శిల్పాశెట్టి (Shilpa Shetty) తన వ్యాపారానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబైలో ఎంతో ప్రసిద్ధి చెందిన తన ‘బాస్టియన్’ రెస్టారెంట్ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ సందర్భంగా శిల్పాశెట్టి ఒక భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. “ముంబైలో ఎంతో ప్రజాదరణ పొందిన మా బాస్టియన్ రెస్టారెంట్ను గురువారం నుండి మూసివేస్తున్నాం. ఈ రెస్టారెంట్ మాకు లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలను అందించింది. ఎన్నో ఆనంద క్షణాలకు ఇది వేదికగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నాం” అని ఆమె పేర్కొన్నారు. చివరిసారిగా గురువారం నాడు ఒక ప్రత్యేక వేడుకను నిర్వహిస్తున్నామని, అందులో వ్యాపార భాగస్వాములు, సన్నిహితులు పాల్గొంటారని తెలిపారు. అంతేకాక, త్వరలోనే సరికొత్త అనుభవాలతో మళ్లీ మీ ముందుకు వస్తామన్న హామీ కూడా ఇచ్చారు.

రుచికరమైన వంటకాలు, ఆహ్లాదకరమైన వాతావరణం,
శిల్పాశెట్టి సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తన ఆలోచనల ఫలితంగా ముంబైలో “బాస్టియన్” (Bastian) పేరుతో ఒక ప్రత్యేకమైన రెస్టారెంట్ను ప్రారంభించారు. తక్కువ కాలంలోనే ఈ స్థలం ముంబై వాసులకు, సెలబ్రిటీలకు ఇష్టమైన ప్రదేశంగా మారింది. రుచికరమైన వంటకాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆధునిక డిజైన్ కారణంగా ఈ రెస్టారెంట్ విశేష గుర్తింపును సంపాదించింది. అనేక బాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ రెస్టారెంట్లో సందడి చేయడం సాధారణంగా మారింది.
ప్రస్తుతం ముంబై వ్యాప్తంగా బాస్టియన్కు మొత్తం ఆరు బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి బ్రాంచ్ ప్రత్యేకతతో, నాణ్యమైన సేవలతో కస్టమర్లను ఆకర్షించగలిగింది. ఈ వ్యాపారం ముంబై లైఫ్స్టైల్లో ఒక భాగమైపోయింది. అయితే ఇప్పుడు ఈ విజయవంతమైన ప్రయాణానికి ముగింపు పలకడం వెనుక కారణాలు ఏమిటనేది పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: