हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Latest News: Shilpa Shetty – దేశం విడిచి పారిపోకుండా .. శిల్పా శెట్టి దంపతులపై లుకౌట్‌ నోటీసులు

Anusha
Latest News: Shilpa Shetty – దేశం విడిచి పారిపోకుండా .. శిల్పా శెట్టి దంపతులపై లుకౌట్‌ నోటీసులు

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty), ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిపై తాజాగా పోలీసులు రూ.60 కోట్ల మోసం కేసులో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. పెట్టుబడి పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు వీరిపై వచ్చాయి. దీంతో స్టార్ కపుల్ మరోసారి చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ముంబైకి చెందిన వ్యాపారి, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం, శిల్పా-రాజ్ కుంద్రా దంపతులు పెట్టుబడిదారుల నుంచి డబ్బులు తీసుకుని వాగ్దానం చేసిన విధంగా రాబడి ఇవ్వలేదని, మోసం జరిగిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు ముందస్తు జాగ్రత్తల భాగంగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

లుకౌట్ నోటీసు అంటే ఏమిటి?

లుకౌట్ నోటీసు అనేది ఇమిగ్రేషన్ లేదా పోలీసు అధికారులు జారీ చేసే ఒక రకమైన అధికారిక అలర్ట్. ఇది నిందితులు దేశం విడిచి పారిపోకుండా నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. విమానాశ్రయాలు, పోర్టులు, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అధికారులకు సమాచారం అందజేసి, నిందితుడిని బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటారు. ప్రస్తుతం శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులపై ఇలాంటి నోటీసులు జారీ చేయడం, కేసు తీవ్రతను సూచిస్తుంది.

శిల్పా శెట్టి ఎప్పుడూ తన ఫిట్నెస్, సినిమాలు, టీవీ షోలతో వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ఆమె భర్త రాజ్ కుంద్రా వివాదాస్పద కేసుల్లో ఇంతకుముందే చిక్కుకున్నారు. ముఖ్యంగా అశ్లీల కంటెంట్ యాప్ కేసులో రాజ్ కుంద్రా (Raj Kundra) అరెస్ట్ అయ్యిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి భారీ ఆర్థిక మోసం ఆరోపణలు వీరి కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.

Latest News
Latest News

వ్యక్తిగత గ్యారెంటీ

2015 నుంచి 2023 మధ్య కాలంలో వ్యాపార విస్తరణ పేరుతో శిల్పా దంపతులు తమ వద్ద రూ. 60.4 కోట్లు తీసుకున్నారని, కానీ ఆ డబ్బును తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించారని దీపక్ కొఠారీ ఈ ఏడాది ఆగస్టులో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తాను శిల్పా-రాజ్ దంపతులను కలిసినట్లు పిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో వారు ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే హోమ్ షాపింగ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలిపారు.

దాదాపు 87.6% వాటా వారిదేనని చెప్పారు. మొదట వీరు 12% వడ్డీతో రూ. 75 కోట్ల రుణం కావాలని అడిగారు. కానీ ఆ మొత్తం పన్నుల భారం లేకుండా పెట్టుబడిగా మారుస్తే మంచిదని ఒప్పించారని ఆయన వివరించారు. ఈ క్రమంలో కొఠారీ, 2015లో రెండు విడతల్లో రూ. 31.9 కోట్లు, రూ. 28.53 కోట్లు బదిలీ చేశారు. 2016లో శిల్పా శెట్టి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చినా, అదే ఏడాది ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం, 2017లో మరో ఒప్పందం విఫలమవడంతో కంపెనీ దివాళా ప్రక్రియలోకి వెళ్లినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

ప్రాథమిక విచారణ

దీపక్ కొఠారీ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి, మోసం, నమ్మకద్రోహం తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మోసం మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఆర్థిక నేరాల విభాగానికి (EOW) బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేసినట్లు ఆర్థిక నేరాల విభాగ (Economic Offences Wing ) వర్గాలు తెలిపాయి. ఈ జంట ట్రావెల్ లాగ్‌లను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-onam-festival-stunning-traditional-looks-of-celebrities-during-onam-celebrations/national/541873/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నిద్రిస్తున్న మహిళా యజమానిపై పనిమనిషి అఘాయిత్యం

నిద్రిస్తున్న మహిళా యజమానిపై పనిమనిషి అఘాయిత్యం

గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం
0:15

గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం

లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. నవదంపతులు బలి

లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. నవదంపతులు బలి

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!

మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

📢 For Advertisement Booking: 98481 12870