Latest News: Ram Charan క‌ర్ణాట‌క సీఎం సిద్ధరామయ్యతో రామ్ చ‌ర‌ణ్ భేటి

Read Time:  1 min
Latest News
Latest News
FONT SIZE
GET APP

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ (Mysore in Karnataka state) పరిసరాల్లో శరవేగంగా కొనసాగుతోంది. భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, మ్యూజిక్, గ్రాండియర్ అన్ని సమానంగా ఉండేలా దర్శకుడు శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా, ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను ప్రత్యేకంగా రూపొందించి, అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది.గత కొన్ని రోజులుగా మైసూర్‌లోని ప్రముఖ ప్రదేశాల్లో టైటిల్ సాంగ్‌కి సంబంధించిన కీలక భాగాలను చిత్రీకరిస్తున్నారు. వందల సంఖ్యలో డ్యాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు, ప్రత్యేక సెట్లు ఏర్పాటు చేసి ఈ పాటను బృహత్తరంగా తెరకెక్కిస్తున్నారు. అయితే, షూటింగ్ మధ్యలో ఒక విషాదం చోటుచేసుకుంది. రామ్ చరణ్‌కి అత్యంత సన్నిహితురాలు అయిన అల్లు కనకరత్నమ్మ మరణం వార్త అందడంతో యూనిట్ తాత్కాలికంగా షూటింగ్ నిలిపివేసింది.

ప్రత్యేక ఆహ్వానం

తన అమ్మమ్మ మృతివార్త తెలిసిన వెంటనే రామ్ చరణ్ మైసూర్ నుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి చివరి చూపు చూసి, కన్నీటి నివాళులు అర్పించారు. కుటుంబానికి అండగా నిలిచి, సంతాపం తెలిపిన అనంతరం అదే రోజున మళ్లీ మైసూర్‌కి బయలుదేరి వెళ్లారు. ఈ సంఘటన రామ్ చరణ్ కుటుంబ అనుబంధాన్ని, తన పనిపట్ల ఉన్న కట్టుబాటును మరోసారి నిరూపించింది.ఆదివారం, రామ్ చరణ్‌కు మరో ప్రత్యేక ఆహ్వానం లభించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Karnataka Chief Minister Siddaramaiah) ప్రత్యేకంగా రామ్ చరణ్‌ను తన నివాసానికి ఆహ్వానించారు. సీఎం ఆహ్వానం మేరకు రామ్ చరణ్ మైసూర్‌లోని ఆయన అధికారిక నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చరణ్.. సిద్ధరామయ్యకు శాలువా కప్పి సన్మానం చేశారు. సీఎం కూడా రామ్ చరణ్‌కి ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Latest News
Latest News

ఫోటోలు ప్రస్తుతం

ఇక‌ సిద్ధరామయ్య ‘పెద్ది’ సినిమా గురించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మైసూర్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న విషయమై కూడా మాట్లాడినట్టు సమాచారం. రామ్ చరణ్ – సిద్ధరామయ్య కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు ఈ భేటీపై స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మర్యాదపూర్వకంగా ఈ భేటి జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం కర్ణాట‌క ముఖ్య మంత్రితో రామ్ చ‌ర‌ణ్ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక జానీ మాస్టర్ సినిమాకి సంబంధించిన పాటని కొరియోగ్రఫీ చేస్తుండ‌గా, ఇందులో సుమారు 1000 మందికి పైగా డాన్సర్లు పాల్గొంటున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో డాన్సర్లతో ఈ సాంగ్‌ని చిత్రీక‌రిస్తుండ‌డం విశేషం.

రామ్ చరణ్ సినీ రంగ ప్రవేశం ఏ సినిమాతో చేశారు?

2007లో వచ్చిన చిరుత సినిమాతో.

రామ్ చరణ్ నటించిన మొదటి బ్లాక్‌బస్టర్ సినిమా ఏది?

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-rukmini-vasant-to-act-with-ntr/cinema/539360/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.