ఇప్పటికే యానిమేటెడ్ (Animated) కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రాచుర్యం పొందుతుంది. సాంకేతికతలో వచ్చిన పురోగతి, అధునాతన గ్రాఫిక్స్, 3D రియాలిస్టిక్ ఎఫెక్ట్స్ ద్వారా ప్రేక్షకులకు పూర్తిగా వాస్తవానికి సమానమైన అనుభవాన్ని ఇవ్వడం సులభమైంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ యానిమేషన్ ట్రెండ్ త్వరగా విస్తరిస్తోంది. సైన్స్ ఫిక్షన్, ఆధ్యాత్మికత, పురాణ కథలు, మిథాలజీ కథలు వంటి విభాగాల్లో యానిమేషన్ వినియోగం పెరిగిపోతోందని స్పష్టంగా కనిపిస్తోంది.
Srinidhi Shetty: తెలుసు కదా సినిమా గురించి శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
అలా వచ్చిన ‘మహావతార్ నరసింహా’ సినిమా (‘Mahavathar Narasimha’ movie) భారీ వసూళ్లను రాబట్టగా, సిరీస్ రూపంలో ‘కురుక్షేత్ర’ రూపొందడం జరిగింది. గతంలో మహాభారతం నేపథ్యంలో చాలానే సినిమాలు .. ధారావాహికలు వచ్చాయి. అయితే ‘కురుక్షేత్ర’ (Kurukshetra Series) ఘట్టాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 10 భాషల్లో ఈ సిరీస్ ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.
18 రోజుల పాటు జరిగిన ‘కురుక్షేత్ర’ (Kurukshetra Series) యుద్ధాన్ని 18 ఎపిసోడ్స్ గా రూపొందించారు. ప్రస్తుతం 9 ఎపిసోడ్స్ స్ట్రీమ్ లోకి వచ్చాయి. మిగతా ఎపిసోడ్స్ ఈ నెల 24న అందుబాటులోకి రానున్నాయి. ఉజాన్ గంగూలీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కథ
పాండవులు అరణ్యవాసం .. అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు. అయినా వారికి ఇవ్వవలసిన రాజ్య భాగాన్ని ఇవ్వకుండా కౌరవులు మాట తప్పుతారు. చివరికి ఐదుగురికి ఐదు ఊళ్లు ఇవ్వమన్నా కూడా నిరాకరిస్తారు. దురాశతో దుర్యోధనుడు (Duryodhana) మొండిపట్టుపడతాడు. అతనిపై ధృత రాష్ట్రుడికి గల వాత్సల్యం .. గాంధారి మౌనం .. శకుని ఎత్తుగడలు .. కర్ణుడి అండదండలు .. అశ్వద్ధామ పరాక్రమం ..
ద్రోణాచార్యుడి పట్ల గల నమ్మకం దుర్యోధనుడు దురుసుగా ముందుకు వెళ్లడానికి కారణమవుతాయి. కృష్ణుడు చేసిన సూచన మేరకు పాండవులు ఓపిక పడతారు. ఈ విషయంలో సంజయుడి రాయబారం కూడా విఫలమవుతుంది. కౌరవులు యుద్ధం పట్ల ఉత్సాహంతో ఉన్నారనే విషయం పాండవులకు అర్థమవుతుంది. దాంతో వారు కూడా యుద్ధానికి సమాయత్తమవుతారు. కృష్ణుడి దగరికి వెళ్లిన దుర్యోధనుడు, యుద్ధంలో తమకి సాయంగా ఉండమని కోరతాడు.
విశ్లేషణ
అదే మాటను అర్జునుడు కూడా అడుగుతాడు.తాను ఆయుధం పట్టనని చెప్పినా ఆయన ఒక్కడు తనవైపు ఉంటేచాలని అర్జునుడు కోరగా, కృష్ణుడి సైన్యం తన వైపుకు రావడం పట్ల దుర్యోధనుడు సంతోషిస్తాడు. ‘కురుక్షేత్ర’ యుద్ధం (The Battle of Kurukshetra) మొదలవుతుంది. తన వాళ్ల ప్రాణాలను తీయడం వలన లభించే విజయం .. రాజ్యసుఖం తనకి అవసరం లేదని అర్జునుడు అంటాడు.
అప్పుడే ఆయనకి కృష్ణుడు గీతోపదేశం చేస్తాడు. దాంతో అర్జునుడు తిరిగి ఆయుధాలు చేపడతాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది? ఈ యుద్ధంలో ఎవరి పాత్ర ఏమిటి? అనేది మిగతా కథ.’రాస్తే రామాయణమంత .. చెబితే మహాభారతమంత’ అని అంటూ ఉంటారు.
అంటే మహాభారతం అంత పెద్దదిగా ఉంటుందని అర్థం. అలాంటి మహాభారతంలోని ‘కురుక్షేత్రం’ ఈ సిరీస్ లోని ప్రధానమైన కథాంశం. ఈ సిరీస్ ఫస్టు ఎపిసోడ్ లో సంజయుడి రాయబారం విఫలమవుతుంది. రెండో ఎపిసోడ్ లో యుద్ధం మొదలవుతుంది. ఒక్కో ఎపిసోడ్ ను ఒక్కో ప్రధానమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: