ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’పై సినీ అభిమానుల్లో అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.కొన్ని నెలల గ్యాప్ తర్వాత ఇటీవల షూటింగ్ ను తిరిగి ప్రారంభించిన చిత్రబృందం, హైదరాబాద్లో నైట్ షెడ్యూల్లో జెట్ స్పీడ్తో షూటింగ్ నిర్వహిస్తోంది. అయితే తాజాగా షూటింగ్ కు స్వల్ప బ్రేక్ పడింది. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ (Jr NTR) స్వల్ప జలుబుతో బాధపడుతున్నట్లు సమాచారం.
Read Also: CM Revanth: దావోస్ పర్యటనలో ప్రముఖులు
త్వరలోనే షూటింగ్ మళ్లీ ప్రారంభం
ఆరోగ్య సమస్య పెద్దది కాకపోయినా, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో యూనిట్ షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఈ సినిమా షూటింగ్కు మరోసారి బ్రేక్ వచ్చినప్పటికీ, ఇది కేవలం ఒకటి లేదా రెండు రోజులకు మాత్రమేనని యూనిట్ తెలిపింది.. త్వరలోనే షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుందని సమాచారం.
మొదట 2026 జనవరి 26న విడుదల చేస్తామని ప్రకటించినా, షూటింగ్ ఆలస్యం కారణంగా రిలీజ్ను 2027కి వాయిదా వేశారు.ఈ చిత్రంలో, రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ స్టార్ టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ మీనన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: