భారత వినోద రంగంలో ఓటీటీ ప్లాట్ఫాంల ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఓటీటీ వేదిక జియో హాట్స్టార్ (Jio Hotstar) దక్షిణాది ప్రేక్షకుల కోసం భారీ స్థాయిలో సరికొత్త కంటెంట్ను ప్రకటించింది. మంగళవారం ‘సౌత్ అన్బౌండ్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 18 కొత్త ప్రాజెక్టుల వివరాలను వెల్లడించింది. ఈ కార్యక్రమానికి అగ్ర కథానాయకులు కమలహాసన్, మోహన్లాల్, నాగార్జున వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు.ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వెబ్ సిరీస్లు, చిత్రాల వివరాలను హాట్స్టార్ (Jio Hotstar) పంచుకుంది.
Read Also: Chiranjeevi Comments: రేవంత్ రెడ్డికే సాధ్యం: గ్లోబల్ సమ్మిట్పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంస
అందుబాటులోకి పలు సిరీస్
ఇందులో భాగంగా ‘ఫార్మా’ అనే సిరీస్ను డిసెంబరు 19 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. వీటితో పాటు తెలుగులో విశేష ప్రజాదరణ పొందిన ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్కు కొనసాగింపుగా సీజన్ 3ని తీసుకురానున్నట్లు ప్రకటించింది.అంతేకాకుండా, ‘కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 3’, ‘కజిన్స్ అండ్ కల్యాణమ్స్’, ‘అనాలీ’, ‘రాసిన్’, ‘1000 బేబీస్ సీజన్ 2’, ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’, ‘వరమ్’,
‘బ్యాచ్మేట్స్’ వంటి పలు సిరీస్లను త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తేనున్నట్లు హాట్స్టార్ ప్రతినిధులు వివరించారు. ఈ కొత్త ప్రాజెక్టులలో కొన్ని పూర్తిస్థాయి కొత్త కథలు కాగా, మరికొన్ని ఇప్పటికే విజయవంతమైన సిరీస్లకు సీక్వెల్స్గా రానున్నాయి. వీటికి సంబంధించిన ఆకట్టుకునే ప్రోమోలను కూడా విడుదల చేశారు.
Read hindi news: hindi.vaartha.co
Epaper : epaper.vaartha.com
Read Also: