ప్రముఖ నటుడు ధనుష్(Dhanush) స్వీయ దర్శకత్వంలో, నిత్యామీనన్-ధనుష్ జంటగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఇడ్లీ కొట్టు’ ఇప్పుడు ఓటీటీ(Ott) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘తిరు’ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. నెల రోజులలోపే ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Read Also: Online Fraud: మ్యాట్రి’మనీ’ మోసాలు లక్షల్లో వసూలు
నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్
ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో అక్టోబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ పోస్టర్ను పంచుకుంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
కథాంశం, నటీనటులు
‘ఇడ్లీ కొట్టు’ చిత్రం ఒక గ్రామంలోని ఇడ్లీ కొట్టు చుట్టూ అల్లుకున్న తండ్రీ-కొడుకుల అనుబంధం, మానవ సంబంధాలు, సాంప్రదాయ విలువలు నేపథ్యంలో హార్ట్-టచింగ్ డ్రామాగా రూపొందించబడింది. ఇందులో ధనుష్ ఇడ్లీ కొట్టు నడుపుకునే ఒక సాధారణ వ్యక్తి మురళి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో రాజ్ కిరణ్, అరుణ్ విజయ్, షాలినీ పాండే, సత్యరాజ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ధనుష్ నటించిన ‘ఇడ్లీ కొట్టు’ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుంది?
ఈ సినిమా అక్టోబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది?
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: