తెలుగు సినీ పరిశ్రమను సంవత్సరాలుగా వేధించిన ‘ఐబొమ్మ’(IBOMMA) పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు జరగడంతో టాలీవుడ్ మొత్తం ఊపిరిపీల్చుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, సురేశ్బాబు తదితర ప్రముఖులు హాజరయ్యారు. పైరసీని అరికట్టడంలో తెలంగాణ పోలీసుల దృఢసంకల్పాన్ని అందరూ అభినందించారు.
Read Also: Akhanda New song:జాజికాయ జాజికాయ సిద్ధం – అఖండ 2 హైప్ పీక్లో!

చిరంజీవి మాట్లాడుతూ సినిమా నిర్మాణంలో
చిరంజీవి మాట్లాడుతూ సినిమా నిర్మాణంలో పాల్గొనే వేలాది కుటుంబాలు తనువొరిగి పనిచేస్తున్న సమయంలో, పైరసీ మాఫియా వారి కష్టానికి గండికొడుతోందన్నారు. “ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని సినిమా తీశినా, రవి వంటి వ్యక్తులు ఒకే క్లిక్తో మొత్తం శ్రమను దోచుకుంటున్నారు. ఇలాంటి నేరాలు కొనసాగకుండా ఉండాలంటే కఠిన చర్యలు తప్పవు” అని ఆయన స్పష్టం చేశారు. గతంలో సీవీ ఆనంద్, ఇప్పుడు సజ్జనార్ కూడా పైరసీ వ్యతిరేక పోరాటంలో కీలకంగా పనిచేస్తున్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రెండు రోజుల క్రితం ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడి లాగిన్ వివరాలు స్వాధీనం చేసుకుని ‘ఐబొమ్మ’ సైట్ను పూర్తిగా బ్లాక్ చేశారు. రవి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్లకుపైగా నగదు, వందలాది హార్డ్డిస్క్లు కూడా సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో, ప్రస్తుతం కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ అరెస్టు టాలీవుడ్కు పెద్ద ఉపశమనం కలిగించింది.
మీ సపోర్ట్ ఎవరికీ?
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: