మచిలీపట్నంలోని రేవతి థియేటర్ (Revathi Theatre)లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. థియేటర్ ఎంట్రన్స్ గేట్ గ్లాసులు ధ్వంసం చేశారు. దీనికి కారణం పరిమితికి మించి ప్రీమియర్ షోకి వచ్చిన అభిమానులను పోలీసులు కట్టడి చేయలేకపోయారు. థియేటర్ యాజమాన్యం కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసింది. ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమా రిలీజ్ సందర్భంగా సినిమా హాల్కి పరిమితికి మించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ హాజరయ్యారు. దీనితో ఒక్కసారిగా తోపులాట జరిగింది. థియేటర్లోకి ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అభిమానుల్లో రెండువర్గాలుగా విడిపోయారు. దీనితో ఒకరిపై ఒకరు దాడికి (attack each other)దిగారు. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం.
కడపలోని రాజా థియేటర్లోనూ ఇదే పరిస్థితి
కాగా కడపలోని రాజా థియేటర్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనినట్లు సమాచారం. ఇక్కడ
అయితే ఏకంగా కర్రలతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. పోలీసులు కలగచేసుకుని, ఈ దాడిని
ఆపేందుకు ప్రయత్నించినా వారివల్ల కాలేదు. దీనితో చోద్యం చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి
ఏర్పడింది. గతంలో హైదరాబాద్ లోని సంథ్యాథియేటర్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. తొకి
సలాట ఘటనలో ఒక మహిళ మరణించగా, ఆమె కుమారుడు చావు అంచుల వరకు వెళ్లాడు.
ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు. ఆ కుటుంబం ఇంటి ఇల్లానికి కోల్పోయింది. సినిమా
ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేవిధంగా ఉండాలే తప్ప విపరీతమైన అభిమానంతో ఒకరిపై
ఒకరు దాడులు చేసుకునేంతగా ఉండకూడదని అధికారులు, ప్రజలు కోరుతున్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Pawan Kalyan : హరిహర వీరమల్లు పార్ట్-2పై పవన్ స్పందన