Ellamma Movie: టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) తన కెరీర్లో కొత్త అడుగు వేయబోతున్నారు. ‘ఎల్లమ్మ’ అనే సినిమాతో ఆయన హీరోగా పరిచయం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ దర్శకుడు వేణు యెల్దండి దర్శకత్వం వహించనుండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దీనిని నిర్మిస్తున్నారు.
Read Also: Anirudh Ravichander: యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో ‘అనిరుధ్’ ఒప్పందం

ఐదు నిమిషాల్లోనే కనెక్ట్ అయ్యా: DSP
హీరోగా తన పరిచయం గురించి స్పందిస్తూ దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు వేణు యెల్దండి ఈ సినిమా కథ వినిపించినప్పుడు, కేవలం ఐదు నిమిషాల్లోనే తాను కథకు పూర్తిగా కనెక్ట్ అయిపోయానని DSP తెలిపారు. గతంలోనూ పలువురు దర్శక నిర్మాతలు తనకు హీరోగా అవకాశాలు ఇచ్చినప్పటికీ, తనలో ఉత్సాహాన్నిచ్చే, సరైన కథ దొరకలేదని ఆయన పేర్కొన్నారు. ‘ఎల్లమ్మ’ కథ తనను బాగా ఆకట్టుకుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.
దిల్ రాజు, వేణులకు కృతజ్ఞతలు
తను హీరోగా పరిచయమయ్యే ఈ అద్భుతమైన అవకాశం కల్పించినందుకు నిర్మాత దిల్ రాజు మరియు దర్శకుడు వేణు యెల్దండిలకు DSP ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సంగీతంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న DSP, ఇప్పుడు నటుడిగా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారోనని సినిమా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: