సోషల్ మీడియా వేదికగా మహిళా సెలబ్రిటీలపై జరుగుతున్న అరాచకాలపై టాలీవుడ్ నటి ఈషా రెబ్బ(Easha Rebba) గళమెత్తారు. తనను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న ఓ వ్యక్తిపై ఆమె కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
Read Also: Varanasi Movie: ‘వారణాసి’ సీక్వెల్ పై రాజమౌళి క్లారిటీ

అసలేం జరిగిందంటే?
ఇటీవల ఈషా రెబ్బ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఆ పోస్ట్కు ఓ వ్యక్తి అత్యంత అసభ్యకరంగా, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన నటి.. సదరు వ్యక్తి ప్రొఫైల్ ఐడీని, అతను చేసిన అసభ్య కామెంట్ను స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు ఆధారాలుగా సమర్పించారు.
రంగంలోకి దిగిన పోలీసులు
ఈషా రెబ్బ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు తన అసలు గుర్తింపును దాచిపెట్టి, ఒక ఫేక్ అకౌంట్ (Fake account) సృష్టించి ఈ కామెంట్స్ పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో సదరు వ్యక్తి ఎక్కడి నుండి ఈ అకౌంట్ వాడుతున్నాడనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బ ఇటీవల ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే సినిమాలో నటించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: