మలయాళ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు దిలీప్ (Dileep) ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్న నటుడికి ఈ తీర్పుతో ఊరట లభించింది. 2017లో దిలీప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ప్రముఖ నటి ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీని కుదిపేసింది.
Read Also: 2025 Movies: గూగుల్ లో ఈ సంవత్సరంలో సర్చ్ చేసిన టాప్ మూవీస్ ఇవే!
ఈ రోజు తీర్పును వెలువరించింది
నటి ఫిర్యాదుతో దిలీప్ (Dileep) ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనను జైలుకు తరలించారు. తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన దిలీప్ బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా కేరళ (Kerala) లోని ఎర్నాకుళం కోర్టు ఈ రోజు తీర్పును వెలువరిస్తూ దిలీప్ ను నిర్దోషిగా ప్రకటించింది.

2017లో మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం రేపింది. కారులో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నటుడు దిలీప్పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నటుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు దిలీప్ను అరెస్ట్ కూడా చేశారు. అయితే బెయిల్పై అతడు రిలీజ్ అయ్యారు. ఇక ఎనిమిదేళ్లపాటూ సాగిన ఈ కేసులో కోర్టు నేడు సంచలన తీర్పు వెలువరించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: