Dhurandhar 2 big update: బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2’ రేపు (గురువారం) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా చూసేందుకు సిద్ధమవుతున్న ప్రేక్షకులకు దర్శకుడు ఒక ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశారు.
Read Also: Anirudh Ravichander: యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో ‘అనిరుధ్’ ఒప్పందం
సినిమా ముగిసిన తర్వాత ఎండ్ క్రెడిట్స్ (End Credits) పూర్తయ్యే వరకు ఎవరూ థియేటర్ల నుంచి బయటకు వెళ్లవద్దని ఆయన కోరారు. సాధారణంగా సినిమా అయిపోగానే ప్రేక్షకులు లేచి వెళ్ళిపోతుంటారు, కానీ ‘ధురంధర్ 2’ విషయంలో అలా చేస్తే ఒక ముఖ్యమైన అప్డేట్ను మిస్ అవుతారని ఆదిత్య ధర్ పేర్కొన్నారు.
క్లైమాక్స్ తర్వాత అసలైన ట్విస్ట్?
సినిమా చివర్లో క్రెడిట్స్ పడే సమయంలో ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ లేదా సినిమా తదుపరి భాగానికి సంబంధించిన హింట్ ఉండే అవకాశం ఉందని సమాచారం. “ఇది సినిమా కథాంశానికి సంబంధించి చాలా కీలకమైన అప్డేట్. ప్రేక్షకులు థియేటర్లోనే ఉండి ఆ క్షణాలను ఆస్వాదించాలని కోరుతున్నాను” అని ఆదిత్య ధర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ ప్రకటనతో ‘ధురంధర్ 2’ పై అంచనాలు మరింత పెరిగాయి. ఆ సర్ప్రైజ్ ఏదైనా కొత్త క్యారెక్టర్ ఎంట్రీనా? లేక మూడవ భాగం గురించిన ప్రకటననా? అన్నది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: