ప్రముఖ కొరియోగ్రాఫర్, సోషల్మీడియా సెలబ్రిటీ ధనశ్రీ వర్మ (Dhanashree Verma) ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్తో విడాకుల అనంతరం మొదటిసారి ఆమె తన భావాలను బహిరంగంగా వ్యక్తం చేయడం ప్రత్యేకంగా మారింది. వ్యక్తిగత అనుభవాలు, భవిష్యత్ లక్ష్యాలు, ప్రేమపై దృష్టికోణం ఇలా అనేక అంశాలను ఆమె స్పష్టంగా తెలియజేశారు.
ప్రస్తుతం అష్నీర్ గ్రోవర్ హోస్ట్ చేస్తున్న ‘రైజ్ అండ్ ఫాల్’ అనే రియాలిటీ షో (A reality show called ‘Rise and Fall’) లో ధనశ్రీ కంటెస్టెంట్గా పాల్గొంటున్నారు. ఈ షోలో పోటీదారులు, జడ్జీలు, ప్రేక్షకులతో మమేకమవుతూ తన ప్రతిభను ప్రదర్శిస్తున్న ఆమె, తాజా ఎపిసోడ్లో తోటి కంటెస్టెంట్లు నయన్దీప్ రక్షిత్, పవన్ సింగ్లతో మాట్లాడిన సందర్భంలో తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు.
పచ్చని పొలాల్లో తాను ఉన్నట్లు కల వచ్చిందని
“ప్రస్తుతం నా జీవితంలోకి ఎవరూ వద్దు. నా గత సంబంధంలో నేను చాలా చూశాను. అందుకే ఇకపై ఈ ఇండస్ట్రీకి నేను లేడీ సల్మాన్ ఖాన్ (Salman Khan) లా ఉంటాను” అని ఆమె స్పష్టం చేశారు.ఈ సందర్భంగా తనకు వచ్చిన ఓ కల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాలోని పచ్చని పొలాల్లో తాను ఉన్నట్లు కల వచ్చిందని, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తున్న సమయంలోనే మెలకువ వచ్చిందని తెలిపారు. ఆ కలలో ప్రేమకు సంబంధించిన ప్రస్తావనే లేదని, తన దృష్టి అంతా పరిసరాలపైనే ఉందని వివరించారు. ఈ వ్యాఖ్యల ద్వారా తాను ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని పరోక్షంగా వెల్లడించారు.

అనవసరమైన డ్రామా
ధనశ్రీ వర్మ, యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal) 2020 డిసెంబర్లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, నాలుగేళ్ల తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని నెలల క్రితమే వీరి విడాకులు అధికారికంగా ఖరారయ్యాయి. విడాకుల (Divorce) తర్వాత అనవసరమైన డ్రామాకు పోకుండా గౌరవప్రదంగా విడిపోయామని ధనశ్రీ గతంలోనే తెలిపారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా హుందాగా వ్యవహరించినట్లు చెప్పారు. కాగా, యజువేంద్ర చాహల్ ప్రస్తుతం కంటెంట్ క్రియేటర్ ఆర్జే మహ్వష్తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తుండగా, ధనశ్రీ మాత్రం తన కెరీర్పైనే పూర్తిగా దృష్టి సారించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: