తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ కాంబినేషన్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో ధనుష్ తన 55వ చిత్రాన్ని (D55) ‘అమరన్’ దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్న వేళ, తాజాగా చిత్రబృందం ఒక అదిరిపోయే అప్డేట్ను విడుదల చేసి అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Read Also: Mrunal Thakur: ధనుష్తో పెళ్లి వార్తలపై మృణాల్ క్లారిటీ
మొదటి సినిమా
ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ను చిత్రయూనిట్ విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్గా మారింది.ధనుష్, మమ్ముట్టి పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు దాదాపు ఏడేళ్ల (2019లో వచ్చిన ‘పేరంబు’) తర్వాత మమ్ముట్టి తమిళ సినిమాలో నటిస్తుండటం విశేషం.ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ధనుష్ స్వయంగా తన వండర్బార్ ఫిలింస్ బ్యానర్పై ఆర్టేక్ స్టూడియోస్తో కలిసి ఈ భారీ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: