Latest News: Smriti Mandhana: క్రికెటర్ మంధాన పెళ్లి వాయిదా

Read Time:  1 min
Latest News: Smriti Mandhana: క్రికెటర్ మంధాన పెళ్లి వాయిదా
FONT SIZE
GET APP

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana), సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహ వేడుక సాంగ్లీలో జరుగుతుండగా ఒక అనుకోని సంఘటన జరిగింది. వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఈరోజు జరగాల్సిన వివాహ వేడుక వాయిదా పడింది. మరోవైపు ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.

Read Also: Guwahati Test: గువాహటి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్ రచ్చ – భారత్‌పై దక్షిణాఫ్రికా ఒత్తిడి

కుటుంబం మొత్తం ఆయన చికిత్సపై దృష్టి సారించింది. ఈ సంఘటనతో పెళ్లి వేదికలో కలకలం చెలరేగింది. అంబులెన్స్ వేదికలోకి రావడంతో అతిథుల్లో ఆందోళన మొదలైంది. విషాదకర పరిస్థితుల కారణంగా పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు స్మృతి మంధానా (Smriti Mandhana) మేనేజర్ ధ్రువీకరించారు.

Cricketer Smriti Mandhana wedding postponed
Cricketer Smriti Mandhana wedding postponed

“స్మృతి మంధానా తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చేరారు. ఈ కష్ట సమయంలో దయచేసి ఊహాగానాలకు తావు ఇవ్వవద్దు. వారి గోప్యతకు భంగం కలిగించవద్దు.” స్మృతి మంధాన మేనేజర్ ప్రకటించారు. స్మృతి మంధానా-పలాష్ ముచ్చల్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

నిరవధికంగా వాయిదా

మరో కొత్త తేదీని ప్రకటించేంత వరకు వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేసినట్లు వెల్లడించారు. వధూవరుల సన్నిహితులు మాట్లాడుతూ.. ప్రస్తుతానికి కుటుంబ శ్రేయస్సుకే అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, కొత్త తేదీని త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.