జూన్ 21 – అంతర్జాతీయ యోగా (Yoga) దినోత్సవం రోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) యోగా ప్రాముఖ్యతను వివరించుతూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన “ఫోకస్ వల్ల ఫిట్నెస్ పెరుగుతుంది. కానీ, యోగా ఈ రెండింటినీ పెంచుతుంది. యోగా మన దేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి” అని రాసుకొచ్చారు. ఈ సందేశం యువతలో, ఆరోగ్య పరిరక్షణలో ఆసక్తి ఉన్నవారిలో విశేష స్పందన కలిగించింది.

ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా. సరిహద్దులు దాటి దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం అని రాసుకొచ్చారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత రెండింటినీ పెంపొందించడంలో యోగా ఒక సమగ్రమైన మార్గమని ఈ సందర్భంగా చిరంజీవి నొక్కి చెప్పారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగాను డేను అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా. సరిహద్దులు దాటి దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం అని రాసుకొచ్చారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత రెండింటినీ పెంపొందించడంలో యోగా ఒక సమగ్రమైన మార్గమని ఈ సందర్భంగా చిరంజీవి నొక్కి చెప్పారు.
యోగా దినోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యం
ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా “అంతర్జాతీయ యోగా మాసోత్సవాలు”ని ఘనంగా నిర్వహించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ-ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు, యోగా గురువులు కలిసి సామూహిక యోగా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో యోగా డేను నిర్వహిస్తున్నారు.
ప్రధాని మోదీ ప్రశంస
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమంగా మార్చిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఏపీలోని ఈ ఉత్సాహానికి హర్షం వ్యక్తం చేశారు. “ఆంధ్రప్రదేశ్ ప్రజలు యోగాను ఎంత ప్రేమగా ఆచరిస్తున్నారో చూస్తే ఎంతో ఆనందంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
Read also: Gaddar Award: గద్దర్ అవార్డుల మొమెంటో విడుదల