పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ (OGబాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 250 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా విజయం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. కుటుంబంతో కలిసి సినిమాను వీక్షించిన ఆయన, అనంతరం చిత్రంపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
కుటుంబంతో కలిసి ‘ఓజీ’ చూడగా..
“ఇది నిజమైన పండుగలాంటి అనుభవం” – చిరు
చిరంజీవి మాట్లాడుతూ, “‘ఓజీ’ చిత్రాన్ని నా కుటుంబంతో కలిసి చూసాను. ప్రతీ సన్నివేశాన్ని ఆస్వాదించాను. విజువల్స్, కథన నిర్మాణం, నటన అన్నీ అత్యున్నతంగా ఉన్నాయి. ఈ సినిమా హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా రూపొందించబడింది” అని వ్యాఖ్యానించారు.

దర్శకుడు సుజిత్ పనితీరుపై ప్రశంసలు
దర్శకుడు సుజిత్ (Sujith)తెరకెక్కించిన విధానం చాలా ప్రెసిషన్తో ఉందని మెగాస్టార్ పేర్కొన్నారు. అండర్వర్ల్డ్ గ్యాంగ్స్టర్ థీమ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, భావోద్వేగాలకు లోటు లేకుండా బలంగా నిలిచిందని అన్నారు.
పవన్ ప్రదర్శన పై చిరు గర్వం
చిరంజీవి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ, “తనదైన స్టైల్, కెరీర్ బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్తో పవన్ సినిమాను మోసాడు. పాత్రలో అతని ఎనర్జీ, మేనరిజం, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉన్నాయి. అభిమానుల ఆశలను మించిన చిత్రం ఇది” అని కొనియాడారు.సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని చిరు తెలిపారు. విజువల్స్ అద్భుతంగా ఉండగా, సంగీతం ఎమోషన్కు మరింత బలం చేకూర్చిందని అభిప్రాయపడ్డారు.
ఓజీ టీంకు మరోసారి అభినందనలు
సినిమా విడుదల రోజే ఓజీ టీంకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మరోసారి విశ్లేషణాత్మక అభిప్రాయం పంచుకోవడం మెగా అభిమానుల్లో ఆనందం కలిగిస్తోంది.“ఈ చిత్ర బృందం అందించిన మంచి సినిమా కోసం వారికి నా హృదయపూర్వక అభినందనలు” అంటూ చిరంజీవి తన మెసేజ్ను ముగించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: