మలయాళ నటుడు, సూపర్స్టార్ మోహన్లాల్కు భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(Dadasaheb Phalke Award)దక్కబోతోందని అధికారికంగా ప్రకటించారు. 2023 సంవత్సరానికి ఆయనను ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. మోహన్లాల్, నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో అందించిన విశేష సేవలకు గుర్తింపు ఇవ్వడమే కాక, భారత సినీ పరిశ్రమలో ఆయన ప్రాముఖ్యతను మరింత పెంచింది.
ఈ నేపథ్యంలో మోహన్ లాల్(Mohanlal)కు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ తన విషెస్ అందించాడు.తాజాగా టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి (Chirajnjeevi) ఎక్స్ వేదికగా చిరకు విషెస్ తెలియజేశాడు.ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోబోతున్న నా ప్రియమైన లాలెట్టన్ @ మోహన్ లాల్కు హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన సినీ ప్రయాణం, ఐకానిక్ ప్రదర్శనలు భారతీయ సినిమాను మరింత సుసంపన్నం చేశాయి.
సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా
మీ ప్రతిభకు నిజమైన తగిన గుర్తింపు ఇది.. అంటూ ఎక్స్ (X) లో ట్వీట్ చేశాడు చిరు. మోహల్ లాల్, చిరంజీవి ఆప్యాయంగా కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేయగా ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.భారత సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా మోహన్లాల్ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికచేశామని సమాచార, ప్రసార శాఖ పేర్కొంది.
భారత సినిమా రంగంలో కొన్ని తరాలపాటు ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎనలేని సేవలు అందించారని కొనియాడింది. ఈ నెల 23న జరుగనున్న 71వ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమంలో మోహన్లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు.మోహన్లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందడం కేవలం ఆయన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాక, మలయాళ, తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు ప్రతిష్టను తీసుకువస్తుంది. భారతీయ సినిమా చరిత్రలో ఆయన పేరును సుస్థిరంగా నిలిపే ఈ ఘట్టం, అభిమానులకు, సినీ పరిశ్రమకు ఒక గొప్ప శుభవార్తగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: