ప్రముఖ బాలీవుడ్ (Bollywood) అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించారు. తన అభిమానులకు ఊహించని షాక్ ఇస్తూ, సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.”అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్నేళ్లుగా శ్రోతలుగా మీరు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఇకపై సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్గా కొత్త అవకాశాలు స్వీకరించబోవడం లేదని సంతోషంగా ప్రకటిస్తున్నాను. నా ప్రయాణాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం” అని అర్జిత్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు.
Read Also: Vishwak Sen: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల
మరో పోస్ట్లో, “సంగీతాన్ని మాత్రం నేను వదిలిపెట్టను. దేవుడు నా పట్ల దయగా ఉన్నాడు. ఒక చిన్న కళాకారుడిగా భవిష్యత్తులో మరింత నేర్చుకుంటాను, స్వతంత్రంగా సంగీతాన్ని సృష్టిస్తాను. ఇప్పటికే అంగీకరించిన కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని పూర్తి చేస్తాను. కాబట్టి ఈ ఏడాది నా పాటలు కొన్ని విడుదల కావచ్చు” అని ఆయన వివరణ ఇచ్చారు.
తెలుగు లో కూడా పాడారు
ప్రస్తుతం ఈ స్టార్ సింగర్ పెట్టిన ఈ పోస్ట్ వైరల్గా మారింది. అర్జిత్ సింగ్ హిందీ (Bollywood)తో పాటు తెలుగు, బెంగాలీ, తమిళం భాషల్లోని పాటలకు కూడా తన గాత్రాన్ని అందించాడు. తెలుగు పాటల విషయానికి వస్తే.. కేడీ, స్వామి రారా, ఉయ్యాల జంపాల, నువ్వే నా బంగారం, నీ జతగా నేనుండాలి, రౌడీ ఫెలో, దోచెయ్, భలే మంచి రోజు, కేశవ, హుషారు, ఓం భీమ్ బుష్ తదితర సినిమాల్లోని పాటకు వర్క్ చేశారు అర్జిత్ సింగ్.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: