
హైదరాబాద్లోని (Begumpet) బేగంపేట విమానాశ్రయంలో ఒక ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ప్రముఖ నటుడు మంచు మనోజ్ అనుకోకుండా ఒకరినొకరు కలుసుకున్నారు. తమ విమానాలు ఎక్కేందుకు రన్వేపైకి వెళ్లిన సమయంలో ఈ ఇద్దరు ప్రముఖులు ఎదురుపడటంతో కాసేపు మాట్లాడుకున్నారు.
Read Also: artificial intelligence: ఆలోచనకు అవరోధంగా కృత్రిమ మేధ
పవన్ కల్యాణ్ను చూడగానే మంచు మనోజ్ (Begumpet) తన భార్య భూమా మౌనికతో కలిసి ఆయన వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించారు. దీనికి పవన్ కూడా చిరునవ్వుతో స్పందించారు. ఇరువురు ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు వీరి మధ్య సరదా సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కల్యాణ్, సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్ ఇలా అనుకోకుండా కలుసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ‘పవర్ ఫుల్ మీట్’కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: