
సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఈ సినిమాలో నటుడు శివాజీ, సీనియర్ నటి లయ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఈటీవీ విన్’లో ఈ నెల 12 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రబృందం, (Bandla Ganesh) తాజాగా సినిమాలోని ‘పాయా పాయా’ అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ఈ పాటలో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తన డ్యాన్స్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Read Also: Ram Charan: స్పెషల్ ఫొటో పంచుకున్న నటుడు
ఫుడ్ ఫెస్టివల్ నేపథ్యంలో కలర్ఫుల్గా చిత్రీకరించిన ఈ పాటలో బండ్ల గణేశ్ ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఆయనతో పాటు కమెడియన్ అలీ, బబ్లూ, భోలే శావలి కూడా సందడి చేశారు. ఈ పాటకు విశేషం ఏమిటంటే, పవన్ కల్యాణ్పై బండ్ల గణేశ్కు ఉన్న అభిమానాన్ని ఇందులో హైలైట్ చేశారు. గతంలో వైరల్ అయిన తన “ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా” అనే డైలాగ్ను ఈ పాటలో రీమిక్స్ చేశారు. పవన్ మేనరిజాన్ని అనుకరిస్తూ బండ్ల వేసిన స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
పవన్ కల్యాణ్ అన్న కూడా హైదరాబాద్ సే పాయా మంగాయా హిట్ల మీద హిట్లతో పవర్ స్టార్ బన్ గయా” వంటి సాహిత్యం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ పాటలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు సీఎం చంద్రబాబును కూడా ప్రస్తావిస్తూ బండ్ల గణేశ్ స్టెప్పులు వేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: