టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)తన సోషల్ మీడియా పోస్ట్ను లైక్ చేసిన ఘటనపై చర్చలు మొదలైన నేపథ్యంలో, నటి అవనీత్ కౌర్ మరోసారి తన స్పందనను తెలియజేశారు. తనపై వచ్చే ఇలాంటి అనవసరమైన వివాదాలు తన దృష్టిని తప్పించలేవని ఆమె స్పష్టం చేశారు.
“నా లక్ష్యం నా కెరీర్ – చర్చలపై దృష్టి లేదు” : అవనీత్
ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ అవనీత్ ఇలా అన్నారు: “నేను నా పనిపైనే ఫోకస్ చేస్తాను. నటనలోనే కాదు, నా వ్యక్తిత్వ వికాసంలోనూ మెరుగుదల కోసం ప్రయత్నిస్తున్నాను. నా తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలనేది నా కల. ఇలాంటి మాటలతో నా దృష్టి చెదరదు.”
తల్లి తనకు శక్తి కేంద్రమని తెలిపిన అవనీత్
తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పిన ఆమె, “నా జీవితంలో నా తల్లి నాకు పెద్ద బలమిచ్చే వ్యక్తి. ఏ విషయం వచ్చినా ఆమెతోనే మొదట పంచుకుంటాను,” అని పేర్కొన్నారు. ఈ వివాదం ఆమె వ్యక్తిగత స్థితిని ఎలాంటి ప్రభావితం చేయలేదని తెలియజేశారు.
ఏం జరిగిందంటే?
గత ఏప్రిల్ 30న అవనీత్ కౌర్ కొన్ని గ్లామర్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్(Instagram) లో షేర్ చేశారు. ఈ ఫోటోలపై విరాట్ కోహ్లీ ఓ లైక్ వేశారు. అయితే, ఆ లైక్ కాసేపటికే తొలగించబడింది. ఇదే విషయాన్ని కొన్ని ఫ్యాన్ పేజీలు గమనించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
లైక్ పై విరాట్ వివరణ: అల్గారిథమ్ వల్ల జరిగిందట!
వివాదం పెరిగిన తరుణంలో, కోహ్లీ స్వయంగా స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్లో ఫీడ్ క్లియర్ చేస్తూ స్క్రోల్ చేస్తుండగా పొరపాటున లైక్ అయినట్టుగా చెప్పారు. దీనిపై అర్థంలేని ఊహాగానాలు చేయవద్దని నెటిజన్లను కోరారు.
త్వరలోనే ‘లవ్ ఇన్ వియత్నాం’ తో స్క్రీన్ పైకి అవనీత్
ప్రస్తుతం అవనీత్ కౌర్ తన నూతన చిత్రం ‘లవ్ ఇన్ వియత్నాం’ విడుదల కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలో ఆమెతో కలిసి నటుడు శంతను మహేశ్వరి కనిపించనున్నాడు. సెప్టెంబర్ 12న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also