యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రగ్స్ నెట్వర్క్ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కోలీవుడ్ సినీ నటి అంజు కృష్ణ (Anju Krishna), తమిళ కో-డైరెక్టర్ విన్సీ నివేత సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. చెన్నై వలసరవాక్కం ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో అంజు కృష్ణ, విన్సీ నివేత, కార్తిక్ రాజు, యశ్వంత్, శ్రీరామ్, అల్విబిన్షా, వెంకటేష్ కుమార్ తదితరులు ఉన్నారు.
Read Also: Aishwarya Arjun: సీతా పయనం ట్రైలర్ రిలీజ్

సరఫరా నెట్వర్క్పై మరింత దర్యాప్తు
నిందితుల వద్ద నుండి పోలీసులు 6 గ్రాముల మెతాంఫేటమైన్ (మెత్), 7 గ్రాముల ఓజీ గంజాయి, 15 గ్రాముల సాధారణ గంజాయి, ఎల్ఎస్డీ స్టాంపులు, స్మోకింగ్ బాంగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 9 మొబైల్ ఫోన్లు, ఒక కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, వారికి న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ సరఫరా నెట్వర్క్పై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: