Anchor Rashmi: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందినట్లు వెలువడిన వార్తలు భారత్లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ జమ్మూకశ్మీర్తో పాటు హైదరాబాద్, బెంగళూరు, లక్నో వంటి ప్రధాన నగరాల్లో షియా ముస్లింలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
Read Also: US-Israel Iran War LIVE: ఇరాన్పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో..
ఈ పరిణామాలపై టాలీవుడ్ ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో స్పందించారు. భారత్లో ఉంటూ ఇతర దేశాల నేతల కోసం రోడ్లపైకి వచ్చి గొడవలు చేయడంపై ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఒక విజ్ఞప్తి చేస్తూ సెటైరికల్ పోస్ట్ చేశారు. “వీరందరినీ వెంటనే ఇరాన్ పంపించండి.. అక్కడికి వెళ్లి వారు నేరుగా ఇరాన్ తరఫున పోరాటం చేస్తారు” అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
దేశంలోని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఇలాంటి నిరసనలు చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. నెటిజన్లలో ఒక వర్గం ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: