బాలయ్య – బోయపాటి కాంబినేషన్ మళ్లీ థియేటర్లలో మాస్ తుఫాను రేపుతోంది. వారం రోజుల వాయిదా అనంతరం వచ్చిన ‘అఖండ 2’ (Akhanda 2) (నిన్న) గురువారం రాత్రి 9 గంటల ప్రీమియర్తో స్టార్ట్ అయి ప్రేక్షకుల్లో మళ్లీ శివతాండవాన్ని గుర్తు చేసేలా హై వోల్టేజ్ యాక్షన్ హంగామాను క్రియేట్ చేసింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల జోడీ మరోసారి బ్లాక్బస్టర్ అందుకుందా? లేదా ఈ మూవీ రివ్యూ లో తెలుసుకుందాం..
Read Also: Rajinikanth: రజనీకాంత్ కు, బర్త్డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ
కథ
శివుడిని ఆరాధిస్తూ, ఆయన నామస్మరణంతోనే ఉంటున్న అఘొరా అఖండకు (బాలకృష్ణ) గురువైన మురళీమోహన్ రాబోయే ఆపద నుంచి భారతదేశాన్ని, హిందు ధర్మాన్ని రక్షించాలంటే మరిన్ని శక్తులను ఆ శివుడి నుండి పొందటం కోసం అఖండను కఠోరమైన సాధన చేయమని కోరతాడు. భారతదేశాన్ని దెబ్బతీయాలంటే.. భారతీయుల సనాతన ధర్మాన్ని దెబ్బతీసి, తద్వారా ప్రజల్లో దేవుడి మీద ఉన్న నమ్మకం తీసేయాలని, అప్పుడే భారత్పై దాడి చేసి భారతదేశాన్ని అక్రమించాలని టిబెట్ దేశ జనరల్తో పాటు చాంగ్ కలిసి ప్లాన్ వేస్తారు. ఇందుకోసం ఠాకూర్ కూడా వీళ్లతో చేతులు కలుపుతాడు.
ఇందుకోసం వీళ్లు ఎంచుకున్న మార్గం ఏమిటి? సనాతన ధర్మాన్ని, ప్రజలను అఖండ ఎలా రక్షించాడు? బాల మురళీకృష్ణ (రెండో బాలకృష్ణ) కూతురుగా నటించిన హర్షలి మల్హోత్రా పాత్ర ఏమిటి? సంయుక్త మీనన్కు కథకు సంబంధం ఏమిటి? విషాచీ (ఆది), అఖండల మధ్య జరిగిన యుద్దం ఏమిటి? చివరకు ఏం జరిగింది? అఖండ రూపంలో శివయ్య దేశాన్ని, ప్రజలను ఎలా రక్షించాడు అనేది మిగతా కథ.
విశ్లేషణ
అఖండకు కొనసాగింపుగా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ కథను అల్లుకున్నాడు. సనాతన ధర్మం, బయోవార్, దైవత్వం ఇలా అన్ని కోణాల్లో ఆసక్తికరమైన సన్నివేశాలతో ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ సమకూర్చుకున్నాడు. ముఖ్యంగా ఎక్కడా కూడా సినిమాపై ఆసక్తి తగ్గకుండా ప్రేక్షకులకు, బాలకృష్ణ అభిమానులకు హై ఇచ్చే సన్నివేశాలను రాసుకున్నాడు. తొలిభాగంలో మురళీ కృష్ణ (చిన్న బాలకృష్ణ)పై యాక్షన్ సన్నివేశాలు, అఖండ సనాతన ధర్మం గురించి చెప్పే సీన్లు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఎంతో పవర్ఫుల్గా చిత్రీకరించారు. ఇక సెకండాఫ్ సినిమాకు కీలకంగా ఉంటుంది.
ప్రతి సన్నివేశం ఆడియన్స్ను మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల విషయంలో లాజిక్లు పట్టించుకోకపోతే అవి అతిశయంగా అనిపించినా వాటిని డిజైన్ చేసిన, విధానం అందర్ని అబ్బురపరుస్తుంది. సెకండాఫ్ కొంచెం నిడివి ఎక్కువగా అనిపించినా, ఎక్కడా కూడా ఆడియన్స్కు బోర్ కొట్టకుండా దర్శకుడు బోయపాటి శ్రీను ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా రాసుకోవడంతో పాటు ఆయన ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాలో ఇంటర్వెల్తో పాటు పతాక సన్నివేశాలు చిత్రీకరించిన తీరు అందరిని మెస్మరైజ్ చేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: