Adivi Sesh Tirumala Visit: శ్రీవారి సేవలో ‘డెకాయిట్’ టీమ్

Read Time:  1 min
Adivi Sesh Tirumala Visit: శ్రీవారి సేవలో ‘డెకాయిట్’ టీమ్
FONT SIZE
GET APP

Adivi Sesh Tirumala Visit: కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామివారిని ‘డెకాయిట్’ చిత్ర బృందం శనివారం ఉదయం దర్శించుకుంది. ఈ చిత్రంలో జంటగా నటించిన హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వీఐపీ విరామ దర్శనంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Read Also: Vijay Sangeetha Divorce: విజయ్ భార్య సంగీత ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి?

Adivi Sesh Tirumala Visit: ‘Decoy’ team makes noise in Srivari Seva
Adivi Sesh Tirumala Visit: ‘Decoy’ team makes noise in Srivari Seva


ఆధ్యాత్మిక యాత్రలో చిత్రబృందం

త్వరలో విడుదల కానున్న తమ చిత్రం ‘డెకాయిట్’ ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ వీరు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అడివి శేష్, మృణాల్‌లను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో కొద్దిసేపు అక్కడ కోలాహలం నెలకొంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లలో వేగం పెంచింది. గురువారం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న శేష్, నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.