రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురందర్’ మూవీ కలెక్షన్లలో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.790.75 కోట్లు వసూళ్లను దాటేసింది. ఈ చిత్రంపై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ ను ఆకాశానికెత్తేశారు. ‘ఆదిత్య ధర్, నీవు భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేశావు’ అంటూ కితాబునిచ్చారు.
Read Also: Tanuja: హాట్ టాపిక్ గా రన్నరప్ తనూజ రెమ్యునరేషన్
ఆదిత్య ధర్ భావోద్వేగంగా స్పందించారు
నీ దర్శకత్వం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. వర్మ చేసిన ఈ ట్వీట్ పై ఆదిత్య ధర్ (Aditya Dhar) భావోద్వేగంగా స్పందించారు. తన అభిమాన దర్శకులలో వర్మ ఒకరని… భయం అంటే ఏమిటో తెలియకుండా సినిమా తీయడాన్ని మీ నుంచే నేర్చుకున్నానని ఆదిత్య ధర్ (Aditya Dhar) అన్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు మీ ప్రభావం తనపై చాలా ఉందని తెలిపారు. మీ సినిమాలు కొన్నిసార్లు తన తలలో గుసగుసలాడేవని, మరికొన్ని సార్లు గట్టిగా అరిచేవని చెప్పారు.
ఈ ట్వీట్ కు ఆర్జీవీ రిప్లై ఇచ్చారు. అప్పట్లో అవి తాను చేసినవి రిస్కులు అని తనకు తెలియదని వర్మ అన్నారు. తన అజ్ఞానంతో తనకు తోచినవి చేశానని తెలిపారు. సినిమా హిట్ అయితే దూరదృష్టి అన్నారని… ఫెయిల్ అయితే కళ్లు లేవు అన్నారని చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: