News Telugu: Aishwarya Rai – అనుమతి లేకుండా తన ఫోటోలను వాడరాదని హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య రాయ్​

Read Time:  1 min
News Telugu
News Telugu
FONT SIZE
GET APP

నటి ఐశ్వర్యరాయ్

నటి ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) తాజాగా దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వీడియోలను వాడుతున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు తన రూపాన్ని, పేరును ఆధారంగా చేసుకొని కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతతో అశ్లీల కంటెంట్ తయారు చేసి ఇంటర్నెట్‌లో ప్రచారం చేస్తున్నారని ఆమె తరఫున సీనియర్ అడ్వకేట్ సందీప్ సేథీ వాదించారు. “పూర్తిగా అసత్యమైన సన్నిహిత ఫొటోలు ఇంటర్నెట్‌లో వ్యాప్తి చెందుతున్నాయి. ఎవరికీ ఆమె పేరు, ఫొటోలు, రూపం వాడుకునే హక్కు లేదు. ఒక వ్యక్తి ఆమె ఫొటోలతో డబ్బు వసూలు చేస్తున్నాడు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం” అని ఆయన కోర్టుకు వివరించారు. వ్యక్తిగత గోప్యత, హక్కులను రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఐశ్వర్య కోరారు.

మన విలువను నిర్ణయించేది సోషల్ మీడియా కాదు

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం గురించిన తన ఆందోళనలను కూడా ఐశ్వర్య అనేక సందర్భాల్లో వెల్లడించారు. “ఇప్పుడున్న తరుణంలో యువత, పెద్దలు కూడా లైక్స్, కామెంట్స్ కోసం సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. వాటిని బట్టి తమ విలువను కొలుస్తున్నారు. కానీ ఇవి నిజజీవితాన్ని ప్రతిబింబించవు” అని ఆమె పేర్కొన్నారు. తాను ఓ తల్లిగా, మహిళగా చిన్నారులపై ఈ మాధ్యమాల ప్రభావం ఎలా ఉంటుందో చూసి కలత చెందుతున్నానని అన్నారు. తాజాగా లోరియల్ పారిస్ ‘లెసన్స్ ఆఫ్ వర్త్’ సిరీస్‌లో భాగంగా ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) చేసిన వీడియోలో కూడా ఇలాంటి బలమైన సందేశం ఉంది. “మన విలువను నిర్ణయించేది సోషల్ మీడియా కాదు. అది మనలోనే ఉంటుంది. ఆ విలువను మనమే మనకు ఇవ్వాలి. ప్రతి లైక్, కామెంట్ మన ఆత్మగౌరవాన్ని కొలిచే సాధనం కాదు. కాబట్టి అద్దంలో చూసుకుని మనమే మనతో ‘ఐ యామ్ వర్త్ ఇట్’ అని చెప్పుకోవాలి” అని సందేశమిచ్చారు. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ, యువతలో చర్చనీయాంశమైంది.

News Telugu

News Telugu

వయస్సుతో సంబంధం లేకుండా

ఐశ్వర్య అభిప్రాయంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ సోషల్ మీడియా (Social media) కు బానిసలుగా మారుతున్నారని ఆందోళన. బయట నిజజీవితాన్ని అర్థం చేసుకోవాలంటే సోషల్ మీడియా మోజు దాటిపోవాలని ఆమె సూచించారు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కోసం సామాజిక మాధ్యమాల్లో వెతకడం తప్పు. అసలు విలువ మనలోనే ఉందని, దాన్ని మనమే గుర్తించుకోవాలని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు, కోర్టు లోపల మరియు బయట ఆమె చూపిస్తున్న ధైర్యం, స్పష్టత నేటి తరం యువతకు కావలసిన పాఠంగా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె వ్యక్తిగత హక్కులను కాపాడుకోవడమే కాకుండా, సమాజంలో నిజమైన విలువలపై చర్చను తెరపైకి తీసుకురావడం విశేషంగా మారింది.

ఐశ్వర్యరాయ్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

ఐశ్వర్యరాయ్ 1973 నవంబర్ 1న కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు.

ఆమె విద్య ఎక్కడ పూర్తిచేశారు?

ముంబైలోని ఆర్య విద్యా మండిర్ హైస్కూల్‌లో చదివారు. ఆపై జయ్‌హింద్ కళాశాల, రాచనా సంసత్ కళాశాలలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/i-am-safe-kajals-clarification/cinema/actress/543642/

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.