యువత వివాహం కంటే తమ కెరీర్ లక్ష్యాలపై(Marriage vs Career) దృష్టి పెట్టడం అనేది నూతన ప్రగతిశీల భారతదేశానికి (New Progressive India) సంకేతమని ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల ఇటీవల వ్యాఖ్యానించారు. ఆధునిక యువతరం తమ వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ఆమె ఈ వ్యాఖ్యల ద్వారా సూచించారు.
Read Also: Cloudflare Error 524: క్లౌడ్ ఫేర్ ఎర్రర్ తో వెబ్సైట్లు డౌన్

20 ఏళ్లలోపే పెళ్లి: శ్రీధర్ వెంబు స్పందన
ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలపై ZOHO టెక్నాలజీస్(ZOHO Technologies) వ్యవస్థాపకుడు, సీఈఓ(Marriage vs Career) అయిన శ్రీధర్ వెంబు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యువత త్వరగా వివాహం చేసుకోవాలని, సమాజానికి జనాభాను అందించే కర్తవ్యాన్ని (Duty to give people to the society) యువత నిర్వర్తించాలని ఆయన సూచించారు.

శ్రీధర్ వెంబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, 20 ఏళ్ల లోపే యువ వ్యాపారవేత్తలు, స్త్రీ పురుషులు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని తాను సలహా ఇస్తానని పేర్కొన్నారు. శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు సాంప్రదాయ ఆలోచనలను ప్రతిబింబిస్తూ, కెరీర్కు ముందు వ్యక్తిగత జీవితం స్థిరపడటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :