సినిమాలు విడుదల అయినప్పుడు హీరోల కటౌట్స్ పెట్టడం అనేది సాధారణంగా చాలా సాధారణ విషయం.అయితే ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో డైరెక్టర్ సుకుమార్ కూడా కటౌట్ ఏర్పాటు చేశాడు.కానీ తెలుగు సినిమా చరిత్రలో ఇదొక ప్రత్యేక ఘట్టం. అది ఏమిటంటే, మొట్టమొదటి సారి ఒక హీరోయిన్కి కటౌట్ పెట్టారు. ఈ ఘనత దక్కినవారు అక్కినేని నాగ చైతన్య మరియు సాయి పల్లవి తండేల్ అనే సినిమాలో వీరిద్దరు జంటగా నటించారు.ఈ సినిమా లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ తరువాత మరోసారి వీరిద్దరు కలిసి నటించిన చిత్రం. తండేల్ శుక్రవారం (ఫిబ్రవరి 07) విడుదలై మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

నాగ చైతన్య కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా థియేటర్లలో పండగ వాతావరణాన్ని సృష్టించింది.తండేల్ మూవీ విడుదల సందర్భంగా, థియేటర్లను నగ చైతన్య కటౌట్స్, పోస్టర్లతో అలంకరించారు. అయితే ఈసారి తెలుగు సినిమా చరిత్రలోనే ఇదొక కొత్త చరిత్ర నమోదైంది. సాయి పల్లవి అభిమానులు, ఆమెను గౌరవిస్తూ ఆమె కటౌట్ ఏర్పాటు చేశారు ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్కు దక్కని గౌరవం.ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవిని ఈ కొత్త గౌరవం ఇచ్చిన వారి మధ్య 2024 జూన్లో ఆమె సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లినప్పుడు అక్కడి ఫ్యాన్స్ ఈ ఆలోచనతో సాయి పల్లవికి పెద్ద కటౌట్ ఏర్పాటు చేశారు.
సంగం థియేటర్ వద్ద ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేయడంతో, ఇది టాలీవుడ్లో పెద్ద సంచలనంగా మారింది. ఇదే ఒక హీరోయిన్కి ఇలా కటౌట్ పెట్టడాన్ని గుర్తించారు.సాయి పల్లవి కటౌట్కు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు ‘లేడీ పవర్ స్టార్’‘బాక్సాఫీస్ క్వీన్’ అని అభివర్ణిస్తూ, ఆమె గౌరవాన్ని పొగడుతున్నారు. తండేల్ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్, బన్నీ వాస్, సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించడంతో పాటు, కరుణాకరణ్, ప్రకాశ్ బెలావాడి, దివ్య పిళ్లై, పృథ్వీ, కళ్యాణీ నటరాజన్, కల్పలత తదితరులు కూడా కీలక పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.అంటే తండేల్ సినిమా రిలీజ్ సందర్భంగా సాయి పల్లవి కటౌట్ ఏర్పాటుతో మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో ఆమె ప్రత్యేక స్థానం, క్రేజ్ను స్పష్టంగా చాటిచెప్పింది.