తెలుగు జాతిపై వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనటి కస్తూరి,

Read Time:  1 min
Actress Kasthuri
Actress Kasthuri
FONT SIZE
GET APP

తమిళ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె తమిళనాడులోని బ్రాహ్మణులను మద్దతుగా తెలుపుతూ, తెలుగు ప్రజలపై కొన్ని కఠిన వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన రాజుల కాలంలో తెలుగు ప్రజలు రాజమహళాల్లో అంతఃపుర సేవలు అందించేవారని, అలాంటి వారు ఇప్పుడు తమను తమిళులుగా గుర్తించుకోవడం వెర్రిపనిగా ఉందని అన్నారు. తెలుగు ప్రజలు తమను ‘తమిళుల, పేర్కొంటూ పెద్ద మాటలు మాట్లాడడం తనకు సహించలేకపోతున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తద్వారా, 300 ఏళ్ల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర సేవలు చేయడానికి వచ్చినవారే ఇప్పుడు తమది ‘తెలుగు జాతి’ అని గర్వంగా చెబితే, ఇక ఎప్పుడో తమిళనాడులోకి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు ఎవరికీ హక్కు లేదని కస్తూరి వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఆమె ద్రవిడ సిద్ధాంత వాదులపై పరోక్షంగా సవాలు విసిరారు తద్వార, బ్రాహ్మణులు ఇతరుల ఆస్తులను అన్యాయం చేయొద్దని, ఇతరుల భార్యలపై ఆకర్షితులవ్వకూడదని, ఒకరికంటే ఎక్కువ భార్యలను చేసుకోవద్దని చెబుతుంటేనే తమపై వ్యతిరేక ప్రచారం జరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.

కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడులో ఉన్న ఆచారాలు, సంప్రదాయాల మధ్య గల విభేదాలను మరింత తీవ్రమయ్యేలా చేశాయి. తెలుగు ప్రజలను కించపరిచే విధంగా ఆమె వ్యాఖ్యానించడం ద్రవిడ సిద్ధాంత వాదులు, బ్రాహ్మణ వర్గాల మధ్య ఉన్న సున్నితమైన సామాజిక సంబంధాలను దెబ్బతీసినట్టు అయింది.

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.