ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ఉదయం లేవగానే చాలా మంది ముందుగా చూసేది ఫోన్నే. సందేశాలు, నోటిఫికేషన్లు, సోషల్ మీడియా అప్డేట్లు అంటూ గంటల తరబడి స్క్రీన్కే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా WhatsApp, Instagram, Facebook వంటి సోషల్ మీడియా వేదికలు మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే, ఈ డిజిటల్ హడావుడికి పూర్తిగా భిన్నమైన జీవనశైలిని అనుసరిస్తున్న ఓ స్టార్ హీరోయిన్ మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Read Also: Sivaji: థియేటర్లలోనే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’
ఇన్స్టాగ్రామ్ను మాత్రమే చాలా అరుదుగా వాడుతున్నట్లు తెలిపింది
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరోయిన్ రజిషా (Actress Rajisha Vijayan).. గత ఎనిమిదేళ్లుగా వాట్సాప్ను ఉపయోగించడం లేదని తెలిపి అందరినీ షాక్కి గురిచేసింది. కాలేజీ చదువు పూర్తికాగానే ఫేస్బుక్కు గుడ్బై చెప్పేసిన ఆమె ప్రస్తుతం కేవలం ఇన్స్టాగ్రామ్ను మాత్రమే చాలా అరుదుగా వాడుతున్నట్లు తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రజిషా తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటూ.. సోషల్ మీడియా మాయలో పడి విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం కంటే, నిజ జీవితానికే ప్రాధాన్యత ఇవ్వడం తనకు ఇష్టమని స్పష్టం చేసింది. వర్చువల్ బంధాల కంటే ప్రత్యక్షంగా మనుషులతో గడపడమే మిన్న అని ఆమె పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: