Virosh Wedding: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన వ్యక్తిగత లేఖ రాసి, ఈ వివాహం వారి జీవితాల్లో కొత్త, అందమైన అధ్యాయానికి ఆరంభం కావాలని ఆకాంక్షించారు. మోదీ తన లేఖలో భారతీయ సంప్రదాయాల్లోని సప్తపది భావనను ప్రస్తావిస్తూ, విజయ్–రష్మికలు పరస్పర గౌరవం, ప్రేమ, స్నేహంతో జీవితాంతం కలిసి ముందుకు సాగాలని ఆశీర్వదించారు. వారి బంధం కుటుంబాలకు, అభిమానులకు ప్రేరణగా నిలవాలని కూడా పేర్కొన్నారు.
Read Also:Virosh wedding: ఫ్యామిలీ క్రికెట్ టోర్నమెంట్తో గ్రాండ్ సెలబ్రేషన్స్

రేపు ఉదయ్పూర్లో పెళ్లి వేడుక
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం రేపు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరగనున్నట్లు సమాచారం. రాజస్థాన్ రాజవంశ శైలిలో గ్రాండ్గా ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. పెళ్లి అనంతరం మార్చి 4న హైదరాబాద్లో భారీ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశముందని టాక్. అభిమానుల కోసం ప్రత్యేకంగా గ్రాండ్ సెలబ్రేషన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇండస్ట్రీలో హాట్ టాపిక్
విజయ్–రష్మిక జోడీ గతంలో పలు సినిమాల్లో కలిసి నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అందుకే వారి వివాహ వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పడంతో ఈ పెళ్లి మరింత హైలైట్గా మారింది. అయితే, ఈ విషయాలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: