తెలుగు సినిమా (Telugu movies) పరిశ్రమను గాయపరుస్తున్న పైరసీ దందాపై సైబర్ క్రైమ్ (Cybercrime against piracy) పోలీసులు గట్టిగా దాడికి దిగారు. తాజాగా విడుదలైన పెద్ద సినిమాలపై కన్నేసిన నిందితుడు కిరణ్కుమార్ను బుధవారం అరెస్ట్ చేశారు. ఇతను ఆంధ్రప్రదేశ్కి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో అతను దాదాపు 65 సినిమాలపై పైరసీ చేసినట్టు వెల్లడి అయింది.ఇటీవలే విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ భారీ బడ్జెట్తో తెరకెక్కినా పైరసీ బారిన పడింది. శ్రీవిష్ణు నటించిన ఓ తాజా చిత్రం, మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం కూడా పైరసీకి గురవ్వడం చిత్ర పరిశ్రమను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు విస్తుపోయారు.
తొలి రోజే కాపీలను అప్లోడ్ చేస్తున్న ముఠా
సినిమా విడుదలైన మరుసటి క్షణం నుంచే పైరసీ కాపీలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తున్న నెట్వర్క్పై సైబర్ పోలీసులు కూలంకషంగా విచారణ చేపట్టారు. కిరణ్కుమార్ అనే యువకుడు టార్గెట్గా మారాడు. ఇతను ఎక్కువగా బడ్జెట్ భారీగానే ఉన్న సినిమాలపై దృష్టి పెట్టేవాడిగా తేలింది.చాలా సంవత్సరాలుగా పైరసీ టాలీవుడ్కు పెను దెబ్బతో మారింది. నిర్మాతలు కోట్ల రూపాయలు పెట్టి చిత్రాలను రూపొందిస్తే, కొందరు అసమాజిక శక్తులు వాటిని చౌకదారిలో పైరసీ చేస్తూ విడుదల చేస్తున్నారు. ఫలితంగా నిర్మాతలకు, పంపిణీదారులకు భారీ నష్టాలే మిగుస్తున్నాయి.
కిరణ్కుమార్ అరెస్ట్తో కొత్త రహస్యాలు వెలుగు చూడనున్నాయా?
ఇప్పటికే అదుపులోకి తీసుకున్న కిరణ్కుమార్ విచారణలో పైరసీ ముఠాలో మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముంది. ఈ కేసు మరిన్ని నెట్వర్క్లను వెలికితీయబోతుందనే నమ్మకం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Chandrababu Naidu : ఇక్కడున్నది 2014 నాటి చంద్రబాబు కాదు…