తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన “కంగువా” సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ సినిమాలో సూర్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించినా, సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్టులు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. సూర్య ముందుగా “పూరణనూరు” అనే సినిమాలో నటించాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ఆ ప్రాజెక్ట్ తర్వాత సూర్య కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో తన 44వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే నటించనుండగా, సంగీతం అందించేది సంతోష్ నారాయణన్.
సూర్య 2డి ఎంటర్టైన్మెంట్, కార్తీక్ సుబ్బురాజ్ స్టోన్ బెంచ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయముందీ. ప్రారంభంగా “కల్ట్” అనే పేరు పరిశీలించినా, అదే టైటిల్ తమిళ నటుడు అథర్వ యొక్క ప్రాజెక్ట్కి అనుకున్నందున, సూర్య టీమ్ ఆప్షన్లను పునరాలోచిస్తోంది. ఈ సినిమా 2025 పొంగల్ సందర్భంగా విడుదల కానుంది.
అంతేకాక, సూర్య తన 45వ చిత్రంగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నటించనున్నారు. నవంబర్ 28న కోయంబత్తూరులో ప్రారంభమైన ఈ చిత్రంలో, సూర్యకు జోడీగా త్రిష కనిపించనుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం అందించేది ఏఆర్ రెహమాన్, అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు సూర్య కెరీర్లో కీలకమైన మలుపు కావొచ్చని భావిస్తున్నారు. మరి, సూర్య తన తదుపరి సినిమాలతో ఎలా మెప్పిస్తారో చూడాలి.