ఒక ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ గా మారింది

Read Time:  1 min
nayanthara
nayanthara
FONT SIZE
GET APP

సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు, అలాగే వ్యక్తిగత విషయాలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లకు సంబంధించిన విషయాలు నెట్టింట ఎక్కువగా చర్చకు దారితీస్తాయి. ఈ క్రమంలో లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం తెగ వైరల్ అవుతోంది.

నయనతార తన సొగసుతో పాటు అద్భుతమైన నటనతో పాన్-ఇండియా స్టార్ గా పేరొందింది. 2003లో మలయాళ చిత్రం మనసినకరే తో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నయనతార, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాలలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. నయనతార కెరీర్‌లో హిట్ చిత్రాలు అనేకం ఉన్నాయి. 2005లో హరి దర్శకత్వంలో వచ్చిన అయ్యా చిత్రంతో తమిళ ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. తెలుగులో వెంకటేష్ సరసన లక్ష్మీ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె, తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకుంది.

నయనతార తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్, విజయ్, సూర్య వంటి అగ్రనటుల సరసన కూడా నాయికగా కనిపించి అభిమానులను తనవైపు తిప్పుకుంది. ఆమె సినిమాలు అన్ని భాషల ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి ఇదిలా ఉండగా, నయనతార టీవీ సీరియల్స్ కు ఆసక్తి చూపుతుందని, సన్ టీవీ లో ప్రసారమయ్యే గయల అనే సీరియల్‌ను ప్రత్యేకంగా ఇష్టపడుతుందని టాక్. ఈ సీరియల్ యొక్క ఒక్క ఎపిసోడ్ ను కూడా ఆమె మిస్ కాకుండా చూడటం ఆసక్తికరంగా మారింది.

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.